First multiplex in Jammu Kashmir: శ్రీనగర్లో తొలి మల్టీప్లెక్స్ ప్రారంభం.. మూడు దశాబ్ధాల తరువాత ఇప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First multiplex in Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొత్త చరిత్ర మొదలైంది. మూడు దశాబ్దాల కాశ్మీరీ ప్రజల కల నెరవేరింది. గతంలో నిత్యం ఉగ్రవాద దాడులు, కాల్పులతో అట్టుడుకుతూ ఉండే కాశ్మీర్ లో ప్రజలు ఇప్పుడిప్పుడే వినోదానికి దగ్గర అవుతున్నారు. కాశ్మీర్ జిల్లాల్లో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆదివారం పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో మల్లిపర్సస్ థియేటర్లను ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా. దీన్ని చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో కాశ్మీర్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో థియేటర్లు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.
Read Also: Bengaluru: నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్ని హత్య చేసిన ప్రియురాలు
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
తాజాగా జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే తొలిసారిగా మల్టీప్లెక్స్ ప్రారంభం అయింది. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం శ్రీనగర్ పట్టణంలో మల్టీప్లెక్స్ను ప్రారంభించారు. ఈ ఐనాక్స్ మల్టీప్లెక్స్ పూర్తి కావడానికి మొత్తం 5 ఏళ్ల సమయం పట్టింది. తొలి సినిమాగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాను ప్రదర్శించారు. మొత్తం 520 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ థియేటర్ ప్రారంభం అయింది.
1990 నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదం ఎక్కువ కావడంతో.. థియేటర్లు నడుపుతున్న యజమానులకు బెదిరింపులు ఎదురయ్యేవి. దీంతో కాశ్మీర్ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. 1999లో శ్రీనగర్ లోని రీగల్ థియేటర్ ప్రారంభించాలని చూశారు. అయితే థియేటర్ ప్రారంభం తొలిరోజే ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మరణించగా.. 12 మంది వరకు గాయపడ్డారు. అప్పటి నుంచి థియేటర్ల పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తర్వాత నుంచి నెమ్మదిగా కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెడుతుండటంతో కాశ్మీర్ లోయ వ్యాప్తంగా శాంతి నెలకొంది.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..