First multiplex in Jammu Kashmir: శ్రీనగర్లో తొలి మల్టీప్లెక్స్ ప్రారంభం.. మూడు దశాబ్ధాల తరువాత ఇప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First multiplex in Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొత్త చరిత్ర మొదలైంది. మూడు దశాబ్దాల కాశ్మీరీ ప్రజల కల నెరవేరింది. గతంలో నిత్యం ఉగ్రవాద దాడులు, కాల్పులతో అట్టుడుకుతూ ఉండే కాశ్మీర్ లో ప్రజలు ఇప్పుడిప్పుడే వినోదానికి దగ్గర అవుతున్నారు. కాశ్మీర్ జిల్లాల్లో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆదివారం పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో మల్లిపర్సస్ థియేటర్లను ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా. దీన్ని చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో కాశ్మీర్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో థియేటర్లు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.
Read Also: Bengaluru: నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్ని హత్య చేసిన ప్రియురాలు
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
తాజాగా జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే తొలిసారిగా మల్టీప్లెక్స్ ప్రారంభం అయింది. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం శ్రీనగర్ పట్టణంలో మల్టీప్లెక్స్ను ప్రారంభించారు. ఈ ఐనాక్స్ మల్టీప్లెక్స్ పూర్తి కావడానికి మొత్తం 5 ఏళ్ల సమయం పట్టింది. తొలి సినిమాగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాను ప్రదర్శించారు. మొత్తం 520 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ థియేటర్ ప్రారంభం అయింది.
1990 నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదం ఎక్కువ కావడంతో.. థియేటర్లు నడుపుతున్న యజమానులకు బెదిరింపులు ఎదురయ్యేవి. దీంతో కాశ్మీర్ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. 1999లో శ్రీనగర్ లోని రీగల్ థియేటర్ ప్రారంభించాలని చూశారు. అయితే థియేటర్ ప్రారంభం తొలిరోజే ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మరణించగా.. 12 మంది వరకు గాయపడ్డారు. అప్పటి నుంచి థియేటర్ల పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తర్వాత నుంచి నెమ్మదిగా కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెడుతుండటంతో కాశ్మీర్ లోయ వ్యాప్తంగా శాంతి నెలకొంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!