Hijab Row: హిజాబ్ అల్లర్ల వెనక ఆ సంస్థ కుట్ర.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
Karnataka government on the Heijab: కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. మంగళవారం జరిగిన విచారణలో కర్ణాటక ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. హిజాబ్ అల్లర్ల వెనక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఉందని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హిజాబ్ అల్లర్ల వెనక పీఎఫ్ఐ కుట్ర ఉందని తెలిపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి.. హిజాబ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఈ సంస్థ ప్రారంభించిందని కర్ణాటక ప్రభుత్వం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా తన వాదనల్ని వినిపించారు. బుధవారం మరోసారి ఈ అంశంపై విచారణలు జరపనుంది సుప్రీంకోర్టు.
Read Also: Rahul Gandhi: అధ్యక్ష ఎన్నిక వద్దు.. జోడో యాత్రే ముద్దు..!
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
పీఎఫ్ఐ సంస్థ హిజాబ్ ధరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పీఎఫ్ఐ ప్రచారాన్ని చేసిందని.. ఈ వివాదం అప్పటికప్పుడు ఏర్పడింది కాదని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీని వెనక కుట్ర ఉందని తుషార్ మోహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆ సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకే విద్యార్థినులు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు వచ్చారని.. అంతకు ముందు ఏడాది ఏ స్టూడెంట్ కూడా హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరుకాలేదని ఆయన తెలిపారు. హిజాబ్ ను వ్యతిరేకించడం ఏ మతానికి వ్యతిరేకం కాదని.. సమానత్వం, సమగ్రతకు భంగం కలిగించే మతపరమైన దుస్తుల్ని వ్యతిరేకించి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని ఆయన అత్యున్నత కోర్టుకు తెలిపారు. హిజాబ్ అల్లర్లు జరుగుతున్న సమయంలో కొంత మంది కాషాయ కండువాలను కప్పుకుని వచ్చారని.. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని ఆయన సుప్రీంకు తెలిపారు.
విద్యాసంస్థల్లో హిజాబ్ ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ఇస్లాంలో హిజాబ్ అనేది తప్పనిసరి ఆచారం కాదని.. పాఠశాలల్లో హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకించింది. ఈ విషయంపై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!