Hijab Row: హిజాబ్ అల్లర్ల వెనక ఆ సంస్థ కుట్ర.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka government on the Heijab: కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. మంగళవారం జరిగిన విచారణలో కర్ణాటక ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. హిజాబ్ అల్లర్ల వెనక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఉందని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హిజాబ్ అల్లర్ల వెనక పీఎఫ్ఐ కుట్ర ఉందని తెలిపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి.. హిజాబ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఈ సంస్థ ప్రారంభించిందని కర్ణాటక ప్రభుత్వం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా తన వాదనల్ని వినిపించారు. బుధవారం మరోసారి ఈ అంశంపై విచారణలు జరపనుంది సుప్రీంకోర్టు.
Read Also: Rahul Gandhi: అధ్యక్ష ఎన్నిక వద్దు.. జోడో యాత్రే ముద్దు..!
Also Read
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
పీఎఫ్ఐ సంస్థ హిజాబ్ ధరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పీఎఫ్ఐ ప్రచారాన్ని చేసిందని.. ఈ వివాదం అప్పటికప్పుడు ఏర్పడింది కాదని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీని వెనక కుట్ర ఉందని తుషార్ మోహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆ సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకే విద్యార్థినులు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు వచ్చారని.. అంతకు ముందు ఏడాది ఏ స్టూడెంట్ కూడా హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరుకాలేదని ఆయన తెలిపారు. హిజాబ్ ను వ్యతిరేకించడం ఏ మతానికి వ్యతిరేకం కాదని.. సమానత్వం, సమగ్రతకు భంగం కలిగించే మతపరమైన దుస్తుల్ని వ్యతిరేకించి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని ఆయన అత్యున్నత కోర్టుకు తెలిపారు. హిజాబ్ అల్లర్లు జరుగుతున్న సమయంలో కొంత మంది కాషాయ కండువాలను కప్పుకుని వచ్చారని.. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని ఆయన సుప్రీంకు తెలిపారు.
విద్యాసంస్థల్లో హిజాబ్ ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ఇస్లాంలో హిజాబ్ అనేది తప్పనిసరి ఆచారం కాదని.. పాఠశాలల్లో హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకించింది. ఈ విషయంపై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
తాజావార్తలు
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
-
Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!