Bengaluru: నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్ని హత్య చేసిన ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctor killed by fiance in Bengaluru: ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడిని హతమార్చింది ఓ యువతి. తన నగ్న చిత్రాలను సోషల్ మీడియా షేర్ చేసిందుకు ప్రియుడిని స్నేహితులతో కలిసి చంపేసింది. డాక్టరైన ప్రియుడు తన ప్రియురాలికి తెలియకుండా సోషల్ మీడియాలో ఆమె న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు. దీన్ని గమనించిన ప్రియురాలు అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సెప్టెంబర్ 14న మరణించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూర్ లో డాక్టర్ వికాష్(27), ప్రతిప అనే అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వికాష్.. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)కి కోచింగ్ తీసుకునేందుకు నాలుగు నెలల క్రితం బెంగళూరు వెళ్లాడు. రెండేళ్లుగా ప్రతిపతో ప్రేమాయణం నడుపుతున్నాడు వికాస్. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ప్రతిపకు తెలియకుండా వికాష్ ఆమె న్యూడ్ ఫోటోలను తీసి.. తన ఫ్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో ఖాతా తెరిచి అందులో ప్రతిప న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు. ఇదే కాకుండా తమిళనాడులోని తన స్నేహితులకు ఈ ఫోటోలను షేర్ చేశాడు.
Also Read
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
Read Also: Subbulakshmi Jagadeesan: సీఎం స్టాలిన్కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత
ఈ న్యూడ్ ఫోటోలను సెప్టెంబర్ 8న గమనించిన ప్రతిప.. వికాష్ ను నిలదీయగా..వినోదం కోసం చేశానని చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని ప్రతిప తన క్లాస్మేట్ అయిన సుశీల్కి విషయాన్ని తెలపగా.. వికాష్ కు బుద్ధి చెప్పాలని మరో ఇద్దరు నిందితులు గౌతమ్, సూర్యలతో కలిసి దాడి చేశారు. ఈ నెల 10న మైకో లేఅవుట్ లోని సువీల్ ఇంటికి వికాష్ ను తీసుకెళ్లింది ప్రతిప. పథకం ప్రకారం నిందితులంతా కలిసి అతనిపై దాడి చేశారు. అయితే వికాష్ ను చంపే ఉద్దేశం లేకపోవడంతో దాడి చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.
తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడని గుర్తించిన ఓ మహిళ, ఆమె ముగ్గురు స్నేహితులు బెంగుళూరులో తన డాక్టర్-ప్రియుడిపై దాడి చేశారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14న మృతి చెందాడు. ప్రతిపతో పాటు ఆమె ఇద్దరు స్నేహితులు సుశీల్, గౌతమ్ లను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.