PM Narendra Modi: ప్రధాని వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన యూఎస్ఏ, ఫ్రాన్స్.
France and USA praised Prime Minister Modi’s comments: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలు కూడా మోదీ వ్యాఖ్యలు సరైనవని తెలిపాయి. న్యూయార్క్ లో జరుగుతన్న 77వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని ప్రధాని మోదీ చెప్పిన మాట సరైనదని ఆయన అన్నారు. ఇది పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాని.. ఇది సార్వభౌమాధికారానికి సమిష్టి సమయం అని ఆయన అన్నారు.
Read Also: Hijab Row: హిజాబ్ అల్లర్ల వెనక ఆ సంస్థ కుట్ర.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
Also Read
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
మరోవైపు యూఎస్ఏ కూడా మోదీ వ్యాఖ్యలను ప్రశంసిస్తోంది. ఇప్పటికే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ పత్రికలు ప్రధాని మోదీ వ్యాఖ్యలను పొడుగుతూ కథనాలను ప్రచురించాయి. తాజాగా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు పంపిన సందేశాన్ని అమెరికా స్వాగతించిందని..అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) జేక్ సుల్లివన్ మంగళవారం తెలిపారు. వైట్ హౌజ్ లో మాట్లాడిన ఆయన మోదీ చెప్పింది సరైనదే అని అన్నారు. రష్యాతో సుదీర్ఘ సంబంధాలు కలిగి ఉన్న భారత్.. యుద్ధం ముగిసే సమయమని చెప్పడాన్ని అభినందించారు. యూఏన్ఏ చార్టర్ ప్రాథమిక నిబంధనలకు రష్యా కట్టుబడి ఉండటం.. బలవంతంగా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇవ్వడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని సలహా ఇచ్చారు.
ఇటీవల షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్ వెళ్లారు. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ప్రస్తుతం యుగం యుద్ధాలది కాదని ప్రధాని మోదీ పుతిన్ తో అన్నారు. ఈ విషయం గురించి గతంలోనే మీతో ఫోన్లో మాట్లాడానని.. అన్నారు. మీ వైఖరి గురించి తెలుసని.. యుద్ధాన్ని త్వరలోనే ముగించాలని అనుకుంటున్నామని పుతిన్, మోదీకి వెల్లడించారు. ఇద్దరి మధ్య ఆహార భద్రత, ఇంధన సంక్షోభం వంటి వాటిపై చర్చ జరిగింది. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి సహకరించినందుకు మోదీ, పుతిన్ కు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!