PM Narendra Modi: ప్రధాని వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన యూఎస్ఏ, ఫ్రాన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France and USA praised Prime Minister Modi’s comments: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలు కూడా మోదీ వ్యాఖ్యలు సరైనవని తెలిపాయి. న్యూయార్క్ లో జరుగుతన్న 77వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని ప్రధాని మోదీ చెప్పిన మాట సరైనదని ఆయన అన్నారు. ఇది పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాని.. ఇది సార్వభౌమాధికారానికి సమిష్టి సమయం అని ఆయన అన్నారు.
Read Also: Hijab Row: హిజాబ్ అల్లర్ల వెనక ఆ సంస్థ కుట్ర.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
Also Read
- Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
- US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
- Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
మరోవైపు యూఎస్ఏ కూడా మోదీ వ్యాఖ్యలను ప్రశంసిస్తోంది. ఇప్పటికే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ పత్రికలు ప్రధాని మోదీ వ్యాఖ్యలను పొడుగుతూ కథనాలను ప్రచురించాయి. తాజాగా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు పంపిన సందేశాన్ని అమెరికా స్వాగతించిందని..అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) జేక్ సుల్లివన్ మంగళవారం తెలిపారు. వైట్ హౌజ్ లో మాట్లాడిన ఆయన మోదీ చెప్పింది సరైనదే అని అన్నారు. రష్యాతో సుదీర్ఘ సంబంధాలు కలిగి ఉన్న భారత్.. యుద్ధం ముగిసే సమయమని చెప్పడాన్ని అభినందించారు. యూఏన్ఏ చార్టర్ ప్రాథమిక నిబంధనలకు రష్యా కట్టుబడి ఉండటం.. బలవంతంగా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇవ్వడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని సలహా ఇచ్చారు.
ఇటీవల షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్ వెళ్లారు. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ప్రస్తుతం యుగం యుద్ధాలది కాదని ప్రధాని మోదీ పుతిన్ తో అన్నారు. ఈ విషయం గురించి గతంలోనే మీతో ఫోన్లో మాట్లాడానని.. అన్నారు. మీ వైఖరి గురించి తెలుసని.. యుద్ధాన్ని త్వరలోనే ముగించాలని అనుకుంటున్నామని పుతిన్, మోదీకి వెల్లడించారు. ఇద్దరి మధ్య ఆహార భద్రత, ఇంధన సంక్షోభం వంటి వాటిపై చర్చ జరిగింది. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి సహకరించినందుకు మోదీ, పుతిన్ కు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Dhanush: ధనుష్ నెక్స్ట్ మూవీ ఏలియన్ సైన్స్ ఫిక్షనా? ఫ్యాన్స్కు జూలై 10న పండగే!
-
Samsung Galaxy Unpacked 2026: సామ్ సంగ్ ఫోల్డబుల్ 5G ఫోన్లు, గెలాక్సీ వాచ్ 9, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
-
Spiritual: రావణుడు ప్రతిష్ఠించిన శివాలయాలు ఇవే.. వాటి వెనుక ఉన్న పురాణ రహస్యాలు తెలుసా?
-
Made in India Weapons: బ్రహ్మోస్ నుంచి ఆకాశ్తీర్ వరకు.. రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!