Amit Shah: పాకిస్తాన్తో మాటల్లేవ్.. జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No talks with Pakistan Says Amit Shah: జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్ పై, జమ్మూ కాశ్మీర్లో గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు ఉండవని.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్లటి.. దేశంలో అత్యంత ప్రశాంత ప్రదేశాంగా మారుస్తుందని నొక్కి చెప్పారు. బారముల్లాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో 1990 నుంచి 42,000 మంది ప్రాణాలను ఉగ్రవాదం బలితీసుకుందని.. దీని వల్ల ఎవరికైనా ప్రయోజనం చేకూరిందా..? అని ప్రశ్నించారు.
1947 దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువగా పాలించిన అబ్దుల్లా( నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు( పీడీపీ), నెహ్రూ-గాంధీ( కాంగ్రెస్) కుటుంబాలు కాశ్మీర్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. పాకిస్తాన్ తో మాట్లాడాలని కొందరు అంటున్నారని.. పాకిస్తాన్ తో ఎందుకు మాట్లాడాలని..? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించదని.. దాన్ని తుడిచిపెడుతామని అన్నారు. మోదీజీ పాలన కాశ్మీర్ లో ఉపాధి, అభివృద్థిని తీసుకువస్తుందని అన్నారు. గుప్కార్ మోడల్ యువత చేతిలో రాళ్లు, తుపాకులను అందిస్తోందని ఆరోపించారు. మోదీ మోడల్, గుప్కార్ మోడల్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని అన్నారు.
Also Read
- Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
Read Also: BRS Party: అంబర్పేటలో సంబరాలు.. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లాలని..
కొందరు పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారని.. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఎన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. గత మూడేళ్లలో కాశ్మీర్ లోని అన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లు అందించామని ఆయన అన్నారు. ముఫ్తీలు, అబ్దుల్లాలు, కాంగ్రెస్ పార్టీలు కాశ్మీర్ కోసం చేసిందేం లేదని అన్నారు. 1947లో గిరిజన ఆక్రమణదారులతో పోరాడిన కాశ్మీర్ పుత్రుడు మక్బూల్ షేర్వానీకి నివాళులు అర్పించారు అమిత్ షా. అమిత్ షా ప్రసంగం మధ్యలో స్థానిక మసీదు నుంచి నమాజ్ వస్తుండటంతో తన ప్రసంగాన్ని ఆపేసి, నమాజ్ అయిన తర్వాత ప్రసంగం ప్రారంభించారు.
ప్రధాని మోదీ, కాశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని పంచాయతీ, బ్లాక్ లెవల్ వరకు తీసుకెళ్లారని.. ప్రస్తుతం 30 వేలకు మందికిపైగా ప్రజా ప్రతినిధులు ఉన్నారని ఆయన అన్నారు. 1947 నుంచి 70 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ కు కేవలం 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2019 నుంచి ఇప్పటి వరకు కాశ్మీర్ రూ.56,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన అన్నారు. మీరు కాశ్మీర్ ను ఉగ్రవాద ప్రదేశంగా మారిస్తే.. ప్రధాని మోదీ దీన్ని పర్యటాక ప్రదేశంగా మార్చారని అన్నారు. గత అక్టోబర్ వరకు కాశ్మీర్ కు 22 లక్షల మంది పర్యాటకులు వచ్చారని ఆయన అన్నారు. 2014 వరకు కాశ్మీర్ లో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు అవి తొమ్మిది అయ్యాయని అన్నారు. ఆర్టికల్ 370 ఉన్నంత వరకు గుజ్జర్లు, బకర్వాల్లు, పహారీలు రిజర్వేషన్లు పొందలేదని.. ఇప్పడు వారంతా రిజర్వేషన్లు పొందుతారని అమిత్ షా అన్నారు.
తాజావార్తలు
-
World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
-
Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
-
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
-
Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!