kabul Blast: ఆఫ్ఘనిస్తాన్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
Bomb blast in Kabul: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని మసీదులో బుధవారం పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
మూడు రోజుల క్రితం కాబూల్ లోని స్కూల్ లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన రోజు వ్యవధిలోనే బుధవారం మరో బాంబు పేలుడు సంభవించింది. స్కూల్ బాంబు దాడిలో 46 మంది విద్యార్థినులతో పాటు మొత్తం 53 మంది మరణించారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి వరసగా ఎక్కడోచోట బాంబు పేలుళ్లు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియా, హజారాలే టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ లో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు ఐఎస్ ఖోరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తోంది. గతంలో మసీదుల్లో కూడా ఆత్మాహుతి దాడులు చేసి వందల మందిని పొట్టనపెట్టుకుంది.
Also Read
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
Read Also: UP Meerut Couple: అన్నాచెల్లెలు అవుతారని.. జంటని విడదీశారు
గత ఏడాది ఆగస్టులో అమెరికా మద్దతు ఉన్న పౌర ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత నుంచి తాలిబాన్ పాలన అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి తాలిబాన్ పాలనను ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ వ్యతిరేకిస్తోంది. మరోవైపు మహిళల హక్కులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన తాలిబాన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి మహిళలు ఇంటికే పరిమితం అయ్యారు. ఒకవేళ బయటకు వస్తే బురఖా ధరించి భర్త, కుటుంబ సభ్యులతో తోడుగా రావాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పటికీ ప్రపంచ దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్ విదేశాల నుంచి వచ్చే విరాళాలపైనే నెట్టుకువస్తోంది. తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ఆర్థిక సహకారం నిలిచిపోయింది. దీంతో అక్కడ పేదరికం పెరిగింది. ప్రజలు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!