Fake Job Racket: నకిలీ జాబ్స్ మోసం.. మయన్మార్ నుంచి 13మంది ఇండియన్స్ సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
13 Indians trapped in fake IT job racket rescued from Myanmar: నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించారు. మయన్మార్ దేశంలో ఐటీ జాబ్స్ కోసమని వెళ్లారు 45 మంది భారతీయులు. అయితే అక్కడి వెళ్లాక కానీ తెలియలేదు తామంతా మోసపోయామని. మయన్మార్ లోని మైవడ్డీ ప్రాంతంలో అంతర్జాతీయ జాబ్ రాకెట్ బారిన పడిన 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. వీరంతా బుధవారం తమిళనాడుకు చేరుకున్నారని ఆయన వెల్లడించారు.
గత నెలలో మయన్మార్, థాయ్ లాండ్ లోని భారతీయ మిషన్ల ద్వారా 32 మంది భారతీయులను మైవాడి నుంచి రక్షించారు. తాజాగా మరో 13 మందిని సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు. మయన్మార్ నకిలీ జాబ్ రాకెట్లలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించామని.. ఇప్పటికే 32 మంది భారతీయులను రక్షించామని.. అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: HD Kumaraswamy: కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తాం
థాయ్ లాండ్ సరిహద్దుల్లోని ఆగ్నేయ మయన్మార్ లో కయిన్ రాష్ట్రంలోని మైవాడీ ప్రాంతం పూర్తిగా మయన్మార్ ప్రభుత్వం నియంత్రణలో లేదు. అక్కడ సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. అయితే భారతీయులు మయన్మార్ లోకి అక్రమంగా ప్రవేశించారని అక్కడి అధికారులు వీరిని నిర్భంధంలోకి తీసుకున్నారు. దీంతో వీరందరిని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం జాబ్ రాకెట్ తో సంబంధం ఉన్న అనేక మంది ఏజెంట్ల వివరాలను రాష్ట్రాల అధికారులతో పంచుకున్నామని బాగ్చీ వెల్లడించారు.
లావోస్, కంబోడియాలో కూడా ఇలాంటి జాబ్ రాకెట్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని.. వియంటియాన్, నమ్ పెన్, బ్యాంకాక్ లో ఉన్న భారత రాయబార కార్యాలయాల సహకారంతో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేస్తున్నామని ఆయన అన్నారు. మయన్మార్ తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో డిజిటల్ స్కామింగ్, ఫోర్జ్ క్రిఫ్టో కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొన్ని ఎల్టీ కంపెనీలు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాల సాకుతో రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి భారతీయును రిక్రూట్ చేసుకుందని.. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వీరంతా వెళ్లడంతో అక్కడి అధికారులు నిర్భంధంలోకి తీసుకున్నారు.
We have been actively pursuing the case of Indians being trapped in fake job rackets in Myanmar.
Thanks to the efforts of @IndiainMyanmar & @IndiainThailand, around 32 Indians had already been rescued.
Another 13 Indian citizens have now been rescued,& reached Tamil Nadu today. pic.twitter.com/OfkPtnGUkZ
— Randhir Jaiswal (@MEAIndia) October 5, 2022
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!