Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
- ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
- ఈసారి దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
- టెహ్రాన్ నాయకత్వానికి నేరుగా హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో ఇరాన్ మరోసారి దాడికి పాల్పడితే గతంలో కంటే ఎన్నో రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంటూ టెహ్రాన్ నాయకత్వానికి నేరుగా హెచ్చరికలు చేశారు.
దక్షిణ ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో జరిగిన నెగెవ్ కాన్ఫరెన్స్లో ప్రసంగించిన నెతన్యాహు.. ‘‘ఇరాన్ నాయకులకు నేను ఒకటే చెబుతున్నా.. మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్ మౌనంగా ఉంటుందని అనుకోవద్దు. గతంలో జరిగినట్లే ఈసారి కూడా ఉంటుందని అసలు ఊహించకండి. ఈసారి మా ప్రతిస్పందన మరింత శక్తివంతంగా ఉంటుంది.’’ అని హెచ్చరించారు. ఇరాన్ లేదా దానికి మద్దతుగా పనిచేస్తున్న సంస్థలు ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా మాపై దాడి చేస్తే మేము గట్టిగా ప్రతీకారం తీర్చుకోకుండా ఊరుకునే రోజులు ముగిశాయని.. ఇరాన్ నేతృత్వంలోని అక్ష దుష్ట శక్తులు నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఇజ్రాయెల్ బలంగా ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ మరోసారి దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Also Read
- AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
- Trump: తేడాలు చేస్తే ఒమన్ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
- Trump: ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
- Lakshmi Mittal Steel Plant: లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్పై రష్యా దాడి.. ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నేరుగా క్షిపణి దాడులు జరిగిన తర్వాత పరిస్థితి కొంత ప్రశాంతంగా మారినప్పటికీ.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతుండగా.. లెబనాన్లోని ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సహా పలు మిలిటెంట్ సంస్థల నుంచి వచ్చే ముప్పుపై కూడా ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.
ఈ సందర్భంగా హిజ్బుల్లాపై కూడా నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత హిజ్బుల్లా సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. యుద్ధానికి ముందు ఉన్న క్షిపణి నిల్వల్లో ప్రస్తుతం కేవలం 7 నుంచి 8 శాతం మాత్రమే హిజ్బుల్లా దగ్గర మిగిలి ఉందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై హిజ్బుల్లా ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. గాజా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, యుద్ధానికి ముందు కంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో జనాభా మరింత పెరిగిందని తెలిపారు.
తాజావార్తలు
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
-
TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
-
White vs Yellow Potatoes: తెల్ల బంగాళాదుంప vs పసుపు బంగాళాదుంప.. ఏది ఏ వంటకానికి బెస్ట్?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!