Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
- ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
- ఈసారి దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
- టెహ్రాన్ నాయకత్వానికి నేరుగా హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో ఇరాన్ మరోసారి దాడికి పాల్పడితే గతంలో కంటే ఎన్నో రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంటూ టెహ్రాన్ నాయకత్వానికి నేరుగా హెచ్చరికలు చేశారు.
దక్షిణ ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో జరిగిన నెగెవ్ కాన్ఫరెన్స్లో ప్రసంగించిన నెతన్యాహు.. ‘‘ఇరాన్ నాయకులకు నేను ఒకటే చెబుతున్నా.. మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్ మౌనంగా ఉంటుందని అనుకోవద్దు. గతంలో జరిగినట్లే ఈసారి కూడా ఉంటుందని అసలు ఊహించకండి. ఈసారి మా ప్రతిస్పందన మరింత శక్తివంతంగా ఉంటుంది.’’ అని హెచ్చరించారు. ఇరాన్ లేదా దానికి మద్దతుగా పనిచేస్తున్న సంస్థలు ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా మాపై దాడి చేస్తే మేము గట్టిగా ప్రతీకారం తీర్చుకోకుండా ఊరుకునే రోజులు ముగిశాయని.. ఇరాన్ నేతృత్వంలోని అక్ష దుష్ట శక్తులు నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఇజ్రాయెల్ బలంగా ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ మరోసారి దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నేరుగా క్షిపణి దాడులు జరిగిన తర్వాత పరిస్థితి కొంత ప్రశాంతంగా మారినప్పటికీ.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతుండగా.. లెబనాన్లోని ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సహా పలు మిలిటెంట్ సంస్థల నుంచి వచ్చే ముప్పుపై కూడా ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.
ఈ సందర్భంగా హిజ్బుల్లాపై కూడా నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత హిజ్బుల్లా సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. యుద్ధానికి ముందు ఉన్న క్షిపణి నిల్వల్లో ప్రస్తుతం కేవలం 7 నుంచి 8 శాతం మాత్రమే హిజ్బుల్లా దగ్గర మిగిలి ఉందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై హిజ్బుల్లా ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. గాజా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, యుద్ధానికి ముందు కంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో జనాభా మరింత పెరిగిందని తెలిపారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!