Mohan Bhagwat: “మత ఆధారిత” జనాభా అసమతుల్యతను విస్మరించొద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief Mohan Bhagwat comments on Religion-Based Population Imbalance: దసరా సందర్భంగా నాగ్ పూర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యక్రమంలో చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మత ఆధారిత జనాభా అసమతుల్యతను విస్మరించలేమని అన్నారు. జనాభా నియంత్రణ విధానాలకు పిలుపునిచ్చారు మోహన్ భగవత్. జనాభా అసమతుల్యత దేశ విభజనకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కసావో, దక్షిణ సూడాన్ వంటి దేశాలు జనాభా అసమతుల్యత కారణంగా విడిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్ పూర్ లో బుధవారం ఏర్పాటు చేసి వార్షిక దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తోలిసారిగా ప్రముఖ పర్వతారోహకురాలు మహిళ అయిన సంతోష్ యాదవ్ ఆర్ఎస్ఎస్ వార్షిక దసరా ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జనాభా నియంత్రణ కోసం భారత్ ‘‘ అందరికి సమానంగా వర్తించే’’ విధానం అవసరమని వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణతో పాటు మత పరమైన జనాభా సమతుల్యత కూడా విస్మరించవద్దని అన్నారు. ఇటీవల కాలంలో దేశంలో శాంతి సామరస్యం పెంపొందించేందుకు పలువురు ముస్లిం మేధావులు, మతగురువులతో సమావేశం అయిన తర్వాత మోహన్ భగవత్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు తైమూర్, దక్షిణ సూడాన్ దేశాలు మత సమాజ ఆధారితంగా ఏర్పడిన దేశాలకు ఉదాహరణలని ఆయన అన్నారు.
Also Read
- Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
- NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
- Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి 'మాస్టర్ ప్లాన్'ను బట్టబయలు చేసిన షణ్ముగం!
Read Also: Bharat Rashtra Samithi: బీఆర్ఎస్పై కేసీఆర్ ప్రకటన ఇదే..
జనాభా అసమతుల్యత భౌగోళిక సరిహద్దులలో మార్పులు తెస్తుందని.. జననాల రేటులో తేడాలతో పాటు.. బలవంతంగా మతం మారడం, ప్రలోభాలకు మతమార్పిడి, చొరబాట్లు కూడా జనాభా అసమతుల్యతకు కారణం అవుతున్నాయని ఆయన అన్నారు. మైనారిటీల్లో భయాలు ఏర్పడటంపై మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. మా వల్ల మైనారిటీలకు ప్రమాదం ఉందని కొందరు భయపెట్టడం చేస్తున్నారని.. ఇది సంఘ్, హిందువుల స్వభావం కాదని.. సౌభ్రాతృత్వం, శాంతి వైపు సమాజం ఉండాలన్నారు.
మైనారిటీ సంఘాల సభ్యులతో చర్చలు కొనసాగుతాయని..దేశంలో హింసాత్మక ఘటనలను ముస్లిం ప్రముఖులు ఖండిచారని.. శాంతి, సామరస్యతంతో జీవించేందుక మేం అండగా ఉన్నామని మోహన్ భగవత్ అన్నారు. హిందూ రాష్ట్రానికి సంబంధించిన చర్చపై మోహన్ భగవత్ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర భావన సర్వత్రా చర్చ జరుగుతోందని.. చాలా మంది ఈ భావనతో ఏకీభవిస్తున్నారు..కానీ హిందూ అనే పదాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
-
Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
ట్రెండింగ్
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..