Mohan Bhagwat: “మత ఆధారిత” జనాభా అసమతుల్యతను విస్మరించొద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief Mohan Bhagwat comments on Religion-Based Population Imbalance: దసరా సందర్భంగా నాగ్ పూర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యక్రమంలో చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మత ఆధారిత జనాభా అసమతుల్యతను విస్మరించలేమని అన్నారు. జనాభా నియంత్రణ విధానాలకు పిలుపునిచ్చారు మోహన్ భగవత్. జనాభా అసమతుల్యత దేశ విభజనకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కసావో, దక్షిణ సూడాన్ వంటి దేశాలు జనాభా అసమతుల్యత కారణంగా విడిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్ పూర్ లో బుధవారం ఏర్పాటు చేసి వార్షిక దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తోలిసారిగా ప్రముఖ పర్వతారోహకురాలు మహిళ అయిన సంతోష్ యాదవ్ ఆర్ఎస్ఎస్ వార్షిక దసరా ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జనాభా నియంత్రణ కోసం భారత్ ‘‘ అందరికి సమానంగా వర్తించే’’ విధానం అవసరమని వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణతో పాటు మత పరమైన జనాభా సమతుల్యత కూడా విస్మరించవద్దని అన్నారు. ఇటీవల కాలంలో దేశంలో శాంతి సామరస్యం పెంపొందించేందుకు పలువురు ముస్లిం మేధావులు, మతగురువులతో సమావేశం అయిన తర్వాత మోహన్ భగవత్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు తైమూర్, దక్షిణ సూడాన్ దేశాలు మత సమాజ ఆధారితంగా ఏర్పడిన దేశాలకు ఉదాహరణలని ఆయన అన్నారు.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
Read Also: Bharat Rashtra Samithi: బీఆర్ఎస్పై కేసీఆర్ ప్రకటన ఇదే..
జనాభా అసమతుల్యత భౌగోళిక సరిహద్దులలో మార్పులు తెస్తుందని.. జననాల రేటులో తేడాలతో పాటు.. బలవంతంగా మతం మారడం, ప్రలోభాలకు మతమార్పిడి, చొరబాట్లు కూడా జనాభా అసమతుల్యతకు కారణం అవుతున్నాయని ఆయన అన్నారు. మైనారిటీల్లో భయాలు ఏర్పడటంపై మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. మా వల్ల మైనారిటీలకు ప్రమాదం ఉందని కొందరు భయపెట్టడం చేస్తున్నారని.. ఇది సంఘ్, హిందువుల స్వభావం కాదని.. సౌభ్రాతృత్వం, శాంతి వైపు సమాజం ఉండాలన్నారు.
మైనారిటీ సంఘాల సభ్యులతో చర్చలు కొనసాగుతాయని..దేశంలో హింసాత్మక ఘటనలను ముస్లిం ప్రముఖులు ఖండిచారని.. శాంతి, సామరస్యతంతో జీవించేందుక మేం అండగా ఉన్నామని మోహన్ భగవత్ అన్నారు. హిందూ రాష్ట్రానికి సంబంధించిన చర్చపై మోహన్ భగవత్ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర భావన సర్వత్రా చర్చ జరుగుతోందని.. చాలా మంది ఈ భావనతో ఏకీభవిస్తున్నారు..కానీ హిందూ అనే పదాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!