Venu Goapl Reddy
Author- NTV Telugu-
Rahul Gandhi: రాహుల్ గాంధీ “ఎన్నికల హిందువు”.. బీజేపీ విమర్శలు
BJP criticizes Rahul Gandhi as Chunav Hindu: గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తెల్లటి ధోతీ, నుదిటిపై విభూతి ధరించి మహాకాల్ ఆలయాన్ని సందర్శించారు. రాహుల్ ఆలయాన్ని సందర్శించడంపై బీజేపీ విమర్శలు మొదలుపెట్టింది. గుజరాత్ ఎన్నికల్లో హిందువుల ఓట్లను పొందేందుకే రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శిస్తున్నారంటూ విమర్శించింది… -
Mehbooba Mufti: ముస్లింలను దెయ్యాలుగా చూపించే ప్రయత్నమే “కాశ్మీర్ ఫైల్స్” సినిమా
Mehbooba Mufti backs Israeli filmmaker's remarks on The Kashmir Files: దేశంలో ‘ కాశ్మీర్ ఫైల్స్’ సినిమా మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఈ వివాదానికి వేదిక అయింది. ఈ కార్యక్రమంలో జ్యూరీ హెడ్ ఇజ్రాయిలీ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ‘ వల్గర్’ సినిమా అని విమర్శించడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. దీనిపై నాదవ్ లాపిడ్… -
India’s GDP: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా భారత వృద్ధిరేటు
India's GDP grows at 6.3% in Jul-Sept quarter of FY23: భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2023 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదు అయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధి చెందిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. బుధవారం అధికారిక డేటాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఇది గతేడాదితో పోలిస్తే తక్కువే. 2021-22 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4గా ఉంది. -
PFI: పీఎఫ్ఐపై నిషేధాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు.
Karnataka High Court dismisses plea challenging ban on PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించింది కర్ణాటక హైకోర్టు. పీఎఫ్ఐ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలు అయిన పిటిషన్ని కొట్టేసింది. నిషేధాన్ని సమర్థించింది. పీఎఫ్ఐ కర్ణాటక అధ్యక్షుడు నసీర్ పాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ పై ఇంతకుముందు కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. -
China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్
China warns US not to interfere in its relationship with India: భారత్-యూఎస్ఏ మిలిటరీ డ్రిల్స్పై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతోంది. చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఇరు దేశాల సైనిక విన్యాసాలు జరగడంపై అభ్యంతరం తెలిపింది. భారత్-అమెరికా దేశాలు ఎల్ఎసీకి సమీపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ‘యుధ్ అభ్యాస్’పేరుతో మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఈ విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇది తనకు ప్రమాదంగా భావిస్తోంది జిత్తులమారి చైనా. ఈ… -
China: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత..ఇతని హయాంలోనే ఆర్థిక శక్తిగా చైనా
China's Ex President Jiang Zemin Dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం 96 ఏళ్ల వయసులో షాంఘైలో కన్నుమూశారు. చైనాను ఆర్థిక శక్తిగా నిలబెట్టడంతో పాటు ప్రజా ఉద్యమాలను అత్యంత క్రూరంగా అణచివేసిన వ్యక్తిగా జియాంగ్కు పేరుంది. బుధవారం లుకేమియా, అవయవాల వైఫల్యంతో మరణించినట్లు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ( సీసీపీ) ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ‘‘కామ్రేడ్ జియాంగ్ జెమిన్ ఒక అద్భుతమైన నాయకుడు... గొప్ప మార్క్సిస్ట్, గొప్ప శ్రామికవర్గ విప్లవకారుడు,… -
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మదర్సాలో భారీ పేలుడు.. 16 మంది మృతి
6 Killed, 24 Injured After Blast In Afghanistan:ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పిల్లలు, సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ సమంగాన్ ప్రావిన్షియల్ ప్రావిన్స్ లోని అయ్బాక్ నగరంలోని మదర్సాలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించినట్లుగా సమాచారం. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడు వెల్లడించాడు. -
Shraddha Walkar Case: 20 మంది హిందూ యువతులతో సంబంధం.. ఉరివేసినా “జన్నత్” లభిస్తుందంటూ అఫ్తాబ్ వెల్లడి..
Aaftab Poonawala Confessed In Polygraph Test, No Remorse: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో అఫ్తాబ్ పూనావాలా కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శద్ధావాకర్ని హత్య చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని పోలీసులు నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఉరి శిక్ష వేసినా నాకు జన్నత్ ( స్వర్గం) లభిస్తుందని, తనను హీరోగా గుర్తుంచుకుంటారని పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పినట్లు సమాచారం. శ్రద్ధాతో రిలేషన్ షిప్ లో… -
Shraddha Walkar Case: శ్రద్ధా మర్డర్ కేసులో అఫ్తాబ్ పూనావాలా కొత్త గర్ల్ఫ్రెండ్.. కీలక విషయాలు వెలుగులోకి
Key facts about Aftab in Shraddha Walker's murder case come to light: ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో క్రమక్రమంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాని చంపేసి మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఇంట్లో ఓ ఫ్రిజ్ లో దాచాడు అఫ్తాబ్ పూనావాలా. అయితే ఇంట్లో శవాన్ని ఉంచుకునే కొత్త గర్ల్ఫ్రెండ్ ను ఫ్లాట్ కు తీసుకువచ్చి సరసాలు అడాడు. అయినా కూడా ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసులో అఫ్తాబ్ కొత్త గర్ల్ఫ్రెండ్… -
Mumbai: సవతి కూతురుపై అత్యాచారం.. డీఏన్ఏ పరీక్ష ఆధారంగా కోర్టు తీర్పు..
Court Relies On DNA Test, Jails Man For Raping Step-Daughter: ముంబైలోని ప్రత్యేక కోర్టు డీఏన్ఏ పరీక్ష నివేదికపై ఓ కేసులో శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే 41 ఏళ్ల వ్యక్తి తన మైనర్ అయిన సవతి కూతురుపై 2019 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. జూన్ 2020లో బాలిక తల్లికి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తల్లికి తెలియజేసింది. అప్పటికే బాలిక 16 వారాల గర్భవతి. తరువాత గర్భాన్ని తీసేశారు.
తాజావార్తలు
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!