Punjab: గవర్నర్ వర్సెస్ సీఎం.. పంజాబ్ అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి
Punjab Politics- Governor vs CM: పంజాబ్ రాష్ట్రంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మధ్య వివాదం చెలరేగుతోంది. బలపరీక్ష నిర్వహించి సభలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం భగవంత్ మాన్ అనుకున్నప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే తాజాగా భగవంత్ మాన్ కోరిన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చాలా దయ’’తో గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారని.. స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వన్ ట్వీట్ చేశారు. అయితే ఈ సెషన్ లో బలపరీక్షపై ఓటింగ్ జరుగుతుందా.. లేదా..? అనే దానిపై స్పష్టత లేదు.
అంతకుముందు గవర్నర్ కార్యాలయం అసెంబ్లీ సెషన్ కార్యక్రమాలను జాబితా అడగడంతో.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నర్ పై విమర్శలు గుప్పించింది. అంతకుముందు పంజాబ్ ప్రభుత్వం సెప్టెంబర్ 22న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆలోచనను గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ కొట్టిపారేశారు. ఆపరేషన్ కమల్ జరుగుతోందని.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ రూ. 25 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆప్ ఆరోపించింది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని వాటిని పోలీసులకు సమర్పించామని ఆప్ పేర్కొంది. దీంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బలపరీక్ష నిరూపించుకోవాలని కోరింది. దీని కోసం గవర్నర్ ను అభ్యర్థించారు.. ఈ నేపథ్యంలో గవర్నర్, సీఎంల మధ్య మాటల యుద్ధం నడిచింది.
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
Read Also: Woman Marries 6 times: ఏడో పెళ్లికి రెడీ.. అడ్డంగా బుక్కైన నిత్యపెళ్ళికూతురు
అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు సాధారణంగా గవర్నర్ కు శాసన సభ వ్యవహారాల జాబితా అందించబడుతుంది.. అయితే 75 ఏళ్లలో ఏ రాష్ట్రపతి, గవర్నర్ శాసనసభ వ్యవహారాల జాబితాను అడగలేదని సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది. ఎట్టకేలకు గవర్నర్ మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను రద్దు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయంటూ ఆప్ విమర్శించింది. గవర్నర్ చర్యను ‘‘ప్రజాస్వామ్య హత్య’’గా అభివర్ణించింది. క్యాబినెట్ ఆమోదించిన సమావేశాలను గవర్నర్ ఎలా తిరస్కరించగలరని..? ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?