Punjab: గవర్నర్ వర్సెస్ సీఎం.. పంజాబ్ అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Politics- Governor vs CM: పంజాబ్ రాష్ట్రంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మధ్య వివాదం చెలరేగుతోంది. బలపరీక్ష నిర్వహించి సభలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం భగవంత్ మాన్ అనుకున్నప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే తాజాగా భగవంత్ మాన్ కోరిన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చాలా దయ’’తో గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారని.. స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వన్ ట్వీట్ చేశారు. అయితే ఈ సెషన్ లో బలపరీక్షపై ఓటింగ్ జరుగుతుందా.. లేదా..? అనే దానిపై స్పష్టత లేదు.
అంతకుముందు గవర్నర్ కార్యాలయం అసెంబ్లీ సెషన్ కార్యక్రమాలను జాబితా అడగడంతో.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నర్ పై విమర్శలు గుప్పించింది. అంతకుముందు పంజాబ్ ప్రభుత్వం సెప్టెంబర్ 22న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆలోచనను గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ కొట్టిపారేశారు. ఆపరేషన్ కమల్ జరుగుతోందని.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ రూ. 25 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆప్ ఆరోపించింది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని వాటిని పోలీసులకు సమర్పించామని ఆప్ పేర్కొంది. దీంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బలపరీక్ష నిరూపించుకోవాలని కోరింది. దీని కోసం గవర్నర్ ను అభ్యర్థించారు.. ఈ నేపథ్యంలో గవర్నర్, సీఎంల మధ్య మాటల యుద్ధం నడిచింది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Woman Marries 6 times: ఏడో పెళ్లికి రెడీ.. అడ్డంగా బుక్కైన నిత్యపెళ్ళికూతురు
అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు సాధారణంగా గవర్నర్ కు శాసన సభ వ్యవహారాల జాబితా అందించబడుతుంది.. అయితే 75 ఏళ్లలో ఏ రాష్ట్రపతి, గవర్నర్ శాసనసభ వ్యవహారాల జాబితాను అడగలేదని సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది. ఎట్టకేలకు గవర్నర్ మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను రద్దు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయంటూ ఆప్ విమర్శించింది. గవర్నర్ చర్యను ‘‘ప్రజాస్వామ్య హత్య’’గా అభివర్ణించింది. క్యాబినెట్ ఆమోదించిన సమావేశాలను గవర్నర్ ఎలా తిరస్కరించగలరని..? ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!