Sonia Gandhi: సోనియా గాంధీతో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar, Lalu Prasad to meet Sonia Gandhi in Delhi today: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, కేసీఆర్ వంటి నేతలు. బీహార్ లో జేడీయూ-ఆర్జేడీ మహాకూటమిలాగే కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు చేసే దిశలో ఉన్నారు నితీష్ కుమార్. ఇటీవల బీహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్.. సెప్టెంబర్ మొదటివారంలో మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, వామపక్షాల నేతలను కలుసుకున్నారు.
తాజాగా ఈ రోజు (ఆదివారం) రోజు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కానున్నారు. దాదాపుగా ఐదేళ్ల తరువాత ఈ మూడు పార్టీల నాయకులు ఒకే వేదికపై కలుసుకుంటున్నారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవీలాల్ జయంతి సందర్భంగా నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ వెళ్లారు. నితీష్ కుమార్ తో కలిసి సోనియాగాంధీని కలుస్తానని మంగళవారం లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు.
Also Read
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
Read Also: Tamilnadu: ఆర్ఎస్ఎస్ నేతలపై కొనసాగుతున్న దాడులు.. పీఎఫ్ఐ అరెస్టుల నేపథ్యంలో ఘటనలు
2024 ఎన్నికలే టార్గెట్ గా మహాకూటమి ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలు ఉన్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసే పనిలో ఉన్నారు బీహార్ నేతలు. 2024 ఎన్నికల్లో బీజేపీని కూకటివేళ్లతో పెకిలించాలని లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. మరోవైపు దక్షిణాది నుంచి కేసీఆర్ కూడా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని భావిస్తున్నారు. ఇటీవల బీహర్ వెళ్లిన సీఎం కేసీఆర్.. ఈ విషయంపై నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో చర్చించారు. మరోవైపు సీఎం నితీష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పీఎం అభ్యర్థి అని ఆయన పార్టీ జేడీయూ కార్యకర్తలు బీహార్ వ్యాప్తంగా పోస్టర్లతో హోరెత్తిస్తున్నారు. తాజాగా ముగ్గురు నేతల మధ్య జరిగే సమావేశంపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.
తాజావార్తలు
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?