BJP: టార్గెట్ 2024.. ఈ నెల 27న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP state in-charges meeting: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. కేంద్ర మంత్రులు, జాతీయాధ్యక్షుడు, ఇతర కీలక నేతలు తరుచుగా పలు రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చ జరిగింది. గతంలో బీజేపీ పార్టీ తక్కువ మెజారిటీతో ఓడిపోయిన 100కు పైగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో దిశానిర్ధేశం చేశారు.
ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం సెప్టెంబర్ 27న జరగబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ అధ్యక్షత వహిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. దక్షిణాదిలో ముఖ్యం తెలంగాణ, తమిళనాడును టార్గెట్ చేసింది బీజేపీ.
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
Read Also: Osmania University: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
2024 ఎన్నికలే టార్గెట్ గా రాష్ట్ర అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ అధిష్టానం. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే పకడ్భందీగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసమే రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో తమ ఉనికి లేని రాష్ట్రాల్లో ఓట్ల శాతంతో పాటు సీట్లను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బీజేపీ బలోపేతంలో భాగంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. గురువారం నుంచి తమిళనాడులో రెండు రోజులు పర్యటించారు. దక్షిణాదిలో బీజేపీ పట్టుపెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలలోనే ఎన్నికలు జరగబోయే గుజరాత్ లో పర్యటించనున్నారు.
తాజావార్తలు
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
-
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!