BJP: టార్గెట్ 2024.. ఈ నెల 27న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP state in-charges meeting: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. కేంద్ర మంత్రులు, జాతీయాధ్యక్షుడు, ఇతర కీలక నేతలు తరుచుగా పలు రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చ జరిగింది. గతంలో బీజేపీ పార్టీ తక్కువ మెజారిటీతో ఓడిపోయిన 100కు పైగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో దిశానిర్ధేశం చేశారు.
ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశం సెప్టెంబర్ 27న జరగబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ అధ్యక్షత వహిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. దక్షిణాదిలో ముఖ్యం తెలంగాణ, తమిళనాడును టార్గెట్ చేసింది బీజేపీ.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Osmania University: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
2024 ఎన్నికలే టార్గెట్ గా రాష్ట్ర అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ అధిష్టానం. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే పకడ్భందీగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసమే రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో తమ ఉనికి లేని రాష్ట్రాల్లో ఓట్ల శాతంతో పాటు సీట్లను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బీజేపీ బలోపేతంలో భాగంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. గురువారం నుంచి తమిళనాడులో రెండు రోజులు పర్యటించారు. దక్షిణాదిలో బీజేపీ పట్టుపెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలలోనే ఎన్నికలు జరగబోయే గుజరాత్ లో పర్యటించనున్నారు.
తాజావార్తలు
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!