Jammu Kashmir: స్కూళ్లలో భజనలు, సూర్యనమస్కారాలు నిలిపేయాలి: ముత్తాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamic body seeks ban on bhajans across schools in jammu kashmir: కాశ్మీర్ పాఠశాలల్లో శనివారం చేస్తున్న భజనలు, సూర్య నమస్కారాలు నిలిపివేయాలని ముత్తాహిదా మజ్లిస్- ఎ- ఉలేమా(ఎంఎంయూ) ప్రభుత్వం, విద్యాశాఖను కోరింది. ముస్లింల మతపరమైన భావాలు దెబ్బతింటున్న కారణంగా వీటన్నింటిని నిలపివేయాలని కోరింది. జామియా మసీద్ మతగురువు, హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని ఈ సంస్థ యోగా, ఉదయం ప్రార్థనల పేరుతో చట్టాలు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ముస్లిం విద్యార్థులు భజనలు, సూర్యనమస్కారాలు చేయాలని పాఠశాల సిబ్బంది అడుగుతున్నారని ఆరోపించింది.
పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులు హిందూమతపరమైన పాటలు పాడాలని, సూర్య నమస్కారాలు చేయాలని కోరడం కాశ్మీర్ ముస్లింలను అణగదొక్కే చర్యగా వారు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని సదరు ముస్లిం సంస్థ పేర్కొంది. ఈ వారం మొదట్లో దక్షిణ కాశ్మీర్ లో శ్రీనగర్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ పాఠశాలలో పిల్లలతో రఘుపతి రాఘవ రాజా రామ్ భజన పాట పాడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వివాదం మొదలైంది.
Also Read
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
Read Also: Woman Married Husband Friend: త్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు దిమ్మతిరిగే షాక్
బీజేపీ కాశ్మీర్ లో హిందుత్వ ఎజెండాను ముందుకు తెస్తోందని పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ విమర్శించారు. కాశ్మీర్ లో ముస్లింల గుర్తింపును బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎంఎంయూ విమర్శించింది. కాశ్మీర్ లో ముస్లింల మత విశ్వాసాలకు సవాలుగా నిలుస్తున్న ఇటువంటి చర్యలను సహించమని ప్రభుత్వానికి, విద్యాశాఖకు తెలియజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్లాంకు వ్యతిరేకంగా పిల్లలపై ఇలాంటి చర్యలను రుద్దితే.. వారిని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరింది ఎంఎంయూ. ముస్లిం టీచర్లు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలిపింది. కాశ్మీర్ లో మత ఛాందసవాదం పెరగడాన్ని అనుమతించబోమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్తాప్ ఠాకూర్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతుంది కొత్త కాదని.. భజనలపై ప్రశ్నలు లేవనెత్తే ముందు వాటిని వినండని ఆ తరువాత ప్రకటనలు చేయాలని ఎంఎంయూకు హితవు పలికారు.
తాజావార్తలు
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!