Jammu Kashmir: స్కూళ్లలో భజనలు, సూర్యనమస్కారాలు నిలిపేయాలి: ముత్తాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamic body seeks ban on bhajans across schools in jammu kashmir: కాశ్మీర్ పాఠశాలల్లో శనివారం చేస్తున్న భజనలు, సూర్య నమస్కారాలు నిలిపివేయాలని ముత్తాహిదా మజ్లిస్- ఎ- ఉలేమా(ఎంఎంయూ) ప్రభుత్వం, విద్యాశాఖను కోరింది. ముస్లింల మతపరమైన భావాలు దెబ్బతింటున్న కారణంగా వీటన్నింటిని నిలపివేయాలని కోరింది. జామియా మసీద్ మతగురువు, హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని ఈ సంస్థ యోగా, ఉదయం ప్రార్థనల పేరుతో చట్టాలు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ముస్లిం విద్యార్థులు భజనలు, సూర్యనమస్కారాలు చేయాలని పాఠశాల సిబ్బంది అడుగుతున్నారని ఆరోపించింది.
పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులు హిందూమతపరమైన పాటలు పాడాలని, సూర్య నమస్కారాలు చేయాలని కోరడం కాశ్మీర్ ముస్లింలను అణగదొక్కే చర్యగా వారు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని సదరు ముస్లిం సంస్థ పేర్కొంది. ఈ వారం మొదట్లో దక్షిణ కాశ్మీర్ లో శ్రీనగర్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ పాఠశాలలో పిల్లలతో రఘుపతి రాఘవ రాజా రామ్ భజన పాట పాడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వివాదం మొదలైంది.
Also Read
- West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
Read Also: Woman Married Husband Friend: త్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు దిమ్మతిరిగే షాక్
బీజేపీ కాశ్మీర్ లో హిందుత్వ ఎజెండాను ముందుకు తెస్తోందని పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ విమర్శించారు. కాశ్మీర్ లో ముస్లింల గుర్తింపును బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎంఎంయూ విమర్శించింది. కాశ్మీర్ లో ముస్లింల మత విశ్వాసాలకు సవాలుగా నిలుస్తున్న ఇటువంటి చర్యలను సహించమని ప్రభుత్వానికి, విద్యాశాఖకు తెలియజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇస్లాంకు వ్యతిరేకంగా పిల్లలపై ఇలాంటి చర్యలను రుద్దితే.. వారిని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరింది ఎంఎంయూ. ముస్లిం టీచర్లు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలిపింది. కాశ్మీర్ లో మత ఛాందసవాదం పెరగడాన్ని అనుమతించబోమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్తాప్ ఠాకూర్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతుంది కొత్త కాదని.. భజనలపై ప్రశ్నలు లేవనెత్తే ముందు వాటిని వినండని ఆ తరువాత ప్రకటనలు చేయాలని ఎంఎంయూకు హితవు పలికారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..