Indian Coast Guard: భారత జలాల్లోకి వచ్చిన పాకిస్తాన్ యుద్ధనౌక.. తరిమేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Coast Guard sent back the Pakistani warship: ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నౌకను తరిమిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోర్ బందర్ తీరంలోని అరేబియా సముద్ర జలాల్లో జూలై నెలలో ఈ ఘటన జరిగింది. పాక్ యుద్ధ నౌక ఆలంగీర్ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న సముద్ర జలాలను దాటి భారత్ జలాల్లోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గుర్తించింది. కోస్ట్ గార్డ్స్ కు చెందిన డోర్నియర్ విమానం మొదటగా ఈ యుద్ధ నౌక భారత జలాల్లోకి రావడాన్ని గుర్తించింది. వెంటనే విషయాన్ని కమాండ్ సెంటర్ కు అందించింది.
డోర్నియర్ విమానం, పాక్ యుద్ధ నౌకకు పలు మార్లు హెచ్చరికలు చేసింది. మీ జలాల్లోకి తిరిగి వెళ్లాలని కోరింది. అయితే ఎంతకూ యుద్దనౌక స్పందించలేదు. దీంతో నౌకకు ఎదురుగా విమానం ఎగురుతూ.. నిఘా పెట్టింది. మరోసారి రేడియో కమ్యూనికేషన్ ద్వారా నౌక కెప్టెన్ ను సంప్రదించేందుకు ప్రయత్నించినా.. వాళ్లు స్పందించలేదు. డోర్నియర్ విమానం నౌకపై పలుమార్లు ఎగరడాన్ని గుర్తించిన యుద్ధ విమానం ఆ తరువాత వెనక్కి తగ్గింది. యుద్ధ నౌక తిరిగి పాక్ జలాల్లోకి వెళ్లేలా చేసింది. అయితే భారత జలాల్లోకి ఎంతదూరం వెళ్తామనే ఉద్దేశ్యంతోనే ఈ నౌక భారత జలాల్లోకి ప్రవేశించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Keerthy Suresh: పెళ్లి పీటలెక్కనున్న మహానటి.. వరుడు ఎవరంటే?
ఇటీవల కాలంలో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ నార్కో టెర్రరిజాన్ని ప్రారంభించింది. మాదక ద్రవ్యాలను గుట్టు చప్పుడు కాకుండా ఇండియాలోకి తీసుకువస్తోంది. సర్ క్రిక్ ప్రాంతంలో ఈ చర్యలను నివారించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుజరాత్ తీరం వెంబడి నిఘాను ఎక్కువ చేశాయి. ద్వారక సమీపంలో ఉండే జనావాసాలు లేని ఏరియాలను కూడా తనిఖీ చేస్తోంది కోస్ట్ గార్డ్స్. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉండటంతో ఆపరేషన్ ఐలాండ్ వాచ్ ని నిర్వహిస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!