New York Incident: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య.. భర్త వేధింపులు భరించలేకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian-origin woman incident in New York: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య వ్యవహారం వైరల్ గా మారింది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోను తీసుకుని తన బాధనంతా వెళ్లకక్కింది. భర్త మారుతాడని ఎదురుచూసిన ఆ యువతికి ఇక మారడనే విషయం తెలిసి.. రోజూ ఈ నరకాన్ని అనుభవించే కన్నా మరణించింది మేలనుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్ దీప్ కౌర్( 30) తన బాధనంతా తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది. ఏడెనిమిదేళ్లు గడిచాయి.. ఇక రోజూ దెబ్బలు తినడాన్ని తట్టుకోలేనంటూ కన్నీటి పర్యంతం అవుతూ ఆ యువతి చేసిన రోదన అందరితో కన్నీరు పెట్టిస్తోంది.
తన అత్తామామ బలవంతంగా తనను ఆత్మహత్యకు ప్రేరేపించారని.. నాన్న.. నేను చనిపోతున్నాను, దయచేసి క్షమించండి అంటూ ఏడ్చింది. మన్ దీప్ కౌర్ కు 4,6 ఏళ్ల ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. దీంతో ఆడపిల్లలనే కంటున్నావంటూ భర్త, అత్తామామల వేధింపులతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ కు చరెందిన మన్ దీప్ కౌర్ కు రంజోధ్ సింగ్ సంధుతో 2015లో వివాహం అయింది. ఆ తరువాత బతుకుదెరువు కోసం యూఎస్ఏ వెళ్లారు. పెళ్లైన మూడేళ్ల తరువాత మన్ దీప్ కౌర్ కూడా యూఎస్ఏ వెళ్లింది. గతంలో కూడా తమ కుమర్తెను తీవ్రంగా కొట్టాడని మన్ దీప్ కౌర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆగస్టు 4న తమ కుమర్తె మరణించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Also Read
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
Read Also: Blood Transfusion: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం.. బాలుడికి హెచ్ ఐవీ
మన్ దీప్ కౌర్ పోస్టు చేసిన వీడియోలో తన బాధనంతా వెళ్లకక్కింది. దాదాపు 5 రోజులు తనను ట్రక్కులో బంధించాడని.. మా నాన్న అతడిపై పోలీస్ కేసు పెట్టాడని.. ఆ సమయంలో అతడు నన్ను ప్రాధేయపడటంతో కేసు వాపస్ తీసుకున్నామని చెప్పింది. కొన్ని వీడియోల్లో మన్ దీప్ కౌర్ భర్త కొడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. తల్లిని కొడుతుంటే కుమార్తెలు ‘‘పాపా, నా మారో మమ్మా ను’’ (పాపా, అమ్మను కొట్టవద్దు) అంటూ అరుపులు వినిపిస్తుంటాయి. ఈ ఘటనపై జస్టిస్ ఫర్ మన్ దీప్ యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.
There are collosal problems in our family & social structure which we conveniently ignore or deny to accept. #DomesticViolence against women is one such serious problem. Suicide by Mandeep Kaur a NRI Punjabi woman is a wake up call to accept the problem and fix it accordingly. pic.twitter.com/F8WpkiLCZY
— Gurshamshir Singh Waraich (@gurshamshir) August 5, 2022
తాజావార్తలు
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!