New York Incident: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య.. భర్త వేధింపులు భరించలేకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian-origin woman incident in New York: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య వ్యవహారం వైరల్ గా మారింది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోను తీసుకుని తన బాధనంతా వెళ్లకక్కింది. భర్త మారుతాడని ఎదురుచూసిన ఆ యువతికి ఇక మారడనే విషయం తెలిసి.. రోజూ ఈ నరకాన్ని అనుభవించే కన్నా మరణించింది మేలనుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్ దీప్ కౌర్( 30) తన బాధనంతా తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది. ఏడెనిమిదేళ్లు గడిచాయి.. ఇక రోజూ దెబ్బలు తినడాన్ని తట్టుకోలేనంటూ కన్నీటి పర్యంతం అవుతూ ఆ యువతి చేసిన రోదన అందరితో కన్నీరు పెట్టిస్తోంది.
తన అత్తామామ బలవంతంగా తనను ఆత్మహత్యకు ప్రేరేపించారని.. నాన్న.. నేను చనిపోతున్నాను, దయచేసి క్షమించండి అంటూ ఏడ్చింది. మన్ దీప్ కౌర్ కు 4,6 ఏళ్ల ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. దీంతో ఆడపిల్లలనే కంటున్నావంటూ భర్త, అత్తామామల వేధింపులతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ కు చరెందిన మన్ దీప్ కౌర్ కు రంజోధ్ సింగ్ సంధుతో 2015లో వివాహం అయింది. ఆ తరువాత బతుకుదెరువు కోసం యూఎస్ఏ వెళ్లారు. పెళ్లైన మూడేళ్ల తరువాత మన్ దీప్ కౌర్ కూడా యూఎస్ఏ వెళ్లింది. గతంలో కూడా తమ కుమర్తెను తీవ్రంగా కొట్టాడని మన్ దీప్ కౌర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆగస్టు 4న తమ కుమర్తె మరణించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
Read Also: Blood Transfusion: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం.. బాలుడికి హెచ్ ఐవీ
మన్ దీప్ కౌర్ పోస్టు చేసిన వీడియోలో తన బాధనంతా వెళ్లకక్కింది. దాదాపు 5 రోజులు తనను ట్రక్కులో బంధించాడని.. మా నాన్న అతడిపై పోలీస్ కేసు పెట్టాడని.. ఆ సమయంలో అతడు నన్ను ప్రాధేయపడటంతో కేసు వాపస్ తీసుకున్నామని చెప్పింది. కొన్ని వీడియోల్లో మన్ దీప్ కౌర్ భర్త కొడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. తల్లిని కొడుతుంటే కుమార్తెలు ‘‘పాపా, నా మారో మమ్మా ను’’ (పాపా, అమ్మను కొట్టవద్దు) అంటూ అరుపులు వినిపిస్తుంటాయి. ఈ ఘటనపై జస్టిస్ ఫర్ మన్ దీప్ యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.
There are collosal problems in our family & social structure which we conveniently ignore or deny to accept. #DomesticViolence against women is one such serious problem. Suicide by Mandeep Kaur a NRI Punjabi woman is a wake up call to accept the problem and fix it accordingly. pic.twitter.com/F8WpkiLCZY
— Gurshamshir Singh Waraich (@gurshamshir) August 5, 2022
తాజావార్తలు
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!