New York Incident: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య.. భర్త వేధింపులు భరించలేకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian-origin woman incident in New York: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య వ్యవహారం వైరల్ గా మారింది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోను తీసుకుని తన బాధనంతా వెళ్లకక్కింది. భర్త మారుతాడని ఎదురుచూసిన ఆ యువతికి ఇక మారడనే విషయం తెలిసి.. రోజూ ఈ నరకాన్ని అనుభవించే కన్నా మరణించింది మేలనుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్ దీప్ కౌర్( 30) తన బాధనంతా తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది. ఏడెనిమిదేళ్లు గడిచాయి.. ఇక రోజూ దెబ్బలు తినడాన్ని తట్టుకోలేనంటూ కన్నీటి పర్యంతం అవుతూ ఆ యువతి చేసిన రోదన అందరితో కన్నీరు పెట్టిస్తోంది.
తన అత్తామామ బలవంతంగా తనను ఆత్మహత్యకు ప్రేరేపించారని.. నాన్న.. నేను చనిపోతున్నాను, దయచేసి క్షమించండి అంటూ ఏడ్చింది. మన్ దీప్ కౌర్ కు 4,6 ఏళ్ల ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. దీంతో ఆడపిల్లలనే కంటున్నావంటూ భర్త, అత్తామామల వేధింపులతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ కు చరెందిన మన్ దీప్ కౌర్ కు రంజోధ్ సింగ్ సంధుతో 2015లో వివాహం అయింది. ఆ తరువాత బతుకుదెరువు కోసం యూఎస్ఏ వెళ్లారు. పెళ్లైన మూడేళ్ల తరువాత మన్ దీప్ కౌర్ కూడా యూఎస్ఏ వెళ్లింది. గతంలో కూడా తమ కుమర్తెను తీవ్రంగా కొట్టాడని మన్ దీప్ కౌర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆగస్టు 4న తమ కుమర్తె మరణించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Blood Transfusion: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం.. బాలుడికి హెచ్ ఐవీ
మన్ దీప్ కౌర్ పోస్టు చేసిన వీడియోలో తన బాధనంతా వెళ్లకక్కింది. దాదాపు 5 రోజులు తనను ట్రక్కులో బంధించాడని.. మా నాన్న అతడిపై పోలీస్ కేసు పెట్టాడని.. ఆ సమయంలో అతడు నన్ను ప్రాధేయపడటంతో కేసు వాపస్ తీసుకున్నామని చెప్పింది. కొన్ని వీడియోల్లో మన్ దీప్ కౌర్ భర్త కొడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. తల్లిని కొడుతుంటే కుమార్తెలు ‘‘పాపా, నా మారో మమ్మా ను’’ (పాపా, అమ్మను కొట్టవద్దు) అంటూ అరుపులు వినిపిస్తుంటాయి. ఈ ఘటనపై జస్టిస్ ఫర్ మన్ దీప్ యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.
There are collosal problems in our family & social structure which we conveniently ignore or deny to accept. #DomesticViolence against women is one such serious problem. Suicide by Mandeep Kaur a NRI Punjabi woman is a wake up call to accept the problem and fix it accordingly. pic.twitter.com/F8WpkiLCZY
— Gurshamshir Singh Waraich (@gurshamshir) August 5, 2022
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!