Praveen Nettaru Case: బీజేపీ నేత ప్రవీణ్ నెట్టార మర్డర్ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు జిల్లాలో విస్తృతంగా సోదాలను నిర్వహించింది. మూడు జిల్లాల్లో 33 చోట్ల సోదాలు చేశారు అధికారులు. మైసూరు, కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యులుగా ఉన్న నిందితులు.. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారును హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Karnataka Minister Umesh Katti dies of cardiac arrest: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం మరణించారు. గుండె పోటు కారణంగా బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. 61 ఏళ్ల ఉమేష్ కత్తి బస్వరాజ్ బొమ్మై మంత్రి వర్గంలో పౌరసరఫరాలు, అటవీ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్టు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమేష్ కత్తి.
Gadkari makes seatbelts mandatory for all car passengers: ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించారు. కారులో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఇదిలా ఉంటే సైరస్ మిస్త్రీ మరణం తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్టు ధరించడాన్ని తప్పని సరి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సైరస్ మిస్త్రీ మరణం తరువాత వెనుక సీటులో ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం…
Rahul Gandhi's Bharat Jodo Yatra launch today: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నేడు ప్రారంభం కాబోతోంది. కన్యాకుమారిలో బుధవారం యాత్ర ప్రారంభం కాబోతోంది. అంతకుముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబుదూర్ లోని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించనున్నారు. మొత్తం 3,570 కిలోమీటర్లు, 150 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర కొనసాగనుంది.
Bengaluru Floods: బెంగళూర్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభం అయింది. దీంతో నగరం అంతా వరద పరిస్థితి నెలకొనడంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్ర నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వర్షాల వల్ల…
BJP action plan on 2024 elections: బీజేపీ కూడా 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. టార్గెట్ 2024పై ఢిల్లీలో బీజేపీ మేథోమధన సదస్సు జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం రోడ్మ్యాప్ సిద్ధం చేసే పనిలో ఉంది బీజేపీ. మంగళవారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రులతో సమావేశం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, యూపీలో బలపడేందుకు కసరత్తు చేస్తోంది.
More than 300 children died in the war between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలకు చేరింది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు పటిష్టమైన రష్యా ముందు కేవలం వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంతో ఉక్రెయిన్…
Queen Elizabeth appoints Liz Truss as UK prime minister: యూకే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో రిషి సునక్పై గెలుపొందిన లిజ్ ట్రస్.. యూకేకు ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజాగా యూకే ప్రధానిగా లిజ్ ట్రస్ను క్వీన్ ఎలిజబెత్ నియమించారు. ఇన్నాళ్లు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామాను రాణి ఆమోదించారు. క్వీన్ ఎలిజబెల్ 2 అధికారికంగా లిజ్ ట్రస్ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. లిజ్ ట్రస్ మంగళవారం…
Cyrus Mistry Accident: ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో చనిపోయారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ పై పోలీసులు విచారిస్తున్నారు. అత్యంత పటిష్టమైన, అధునాతన ఫీచర్లు, అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ వంటి కారు ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోవడంతో ఆ కంపెనీకి చెందిన ఓ టీం ప్రమాదంపై విచారణ జరుపుతోంది. కారు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలను సేకరిస్తోంది. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కార్ డేటాను డీక్రిప్ట్ చేయనున్నట్లు…
PM Sheikh Hasina India Visit: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాలోొ పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు షేక్ హసీనా. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధాని మోదీ, షేక్ హసీనాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వచ్చే 25 ఏళ్లలో భారత్-బంగ్లా సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్, భారత దేశ అతిపెద్ద…