Heavy rain forecast for southern states: భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తనున్నాయి. రానున్న రోజుల్లో అన్ని సౌత్ స్టేట్స్ లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నాలుగు రోజుల పాటు తీవ్రమైన వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో ఒడిశా, మహారాష్ట్రల్లో భారీ వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇదే సమయంలో వాయువ్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Indians Use Antibiotics Excessively, Azithromycin On Top: దేశంలో ప్రజలు యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వాడుతున్నట్లు లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కు ముందు, కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లను విస్తృతంగా వాడినట్లు స్టడీలో వెల్లడించింది. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరం, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ కు లొంగకుండా తయారవుతుందని లాన్సెట్ వెల్లడించింది.
No Jeans, T-Shirts In Office in Uttar Pradesh:ఇక ఆ జిల్లాలో ప్రభుత్వ అధికారులంతా తప్పని సరిగా ఫార్మల్ డెస్సుల్లోనే విధుల్లోకి హాజరు కావాలి. కాదు, కూడదు అని జీన్స్, టీ షర్టులు వేసుకుని వచ్చారో అంతే సంగతులు. ఇలా చేస్తే ఉద్యోగులు ఉన్నతాధికారుల చర్యలకు గురికావాల్సిందే. ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో. బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో(కలెక్టర్ ఆఫీస్) ఉద్యోగులు, అధికారులు తప్పని సరిగా అధికారిక డ్రెస్ కోడ్ లో రావాలని జిల్లా యంత్రాంగం
Rajnath Singh Gifted Horse By Mongolian President: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగోలియా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఏడేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ మంగోలియాలో పర్యటించారు. ఆ సమయంలో మంగోలియా ప్రభుత్వం మోదీకి ఓ గుర్రాన్ని బహూకరించింది. తాజాగా రాజ్ నాథ్ సింగ్ కు కూడా ఆ దేశాధ్యక్షడు ఖరేల్ సుఖ్ ఓ గుర్రాన్ని బహుమతిగా ప్రధానం చేశారు.
Delhi Ban On Firecrackers: ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళికి కూడా ఢిల్లీ నగర పరిధిలో ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ సారి కూడా ఢిల్లీ పరిధిలో ఫైర్ క్రాకర్స్ పై నిషేధం ఉంటుందని ప్రకటించారు. ఆన్ లైన్ లో కూడా పటాకుల అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని.. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను కఠినంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.
Corona cases in india: దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. మూడు నెలల కనిష్ట స్థాయికి కరోనా కేసులు చేరుకున్నాయి. కొన్ని రోజుల వరకు దేశంలో సగటున 15 వేలకు పైగా రోజూవారీ కేసులు నమోదు అవుతుండేవి. అయితే గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 10 వేలకు లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 5,379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 7,094 మంది మహమ్మారి…
CBI Raids Bengal Law Minister In Coal Scam Case: మరో పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసాలు, కార్యాలయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ ) అధికారులు దాడులు చేశారు. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్న మోలోయ్ ఘటక్ మూడు ఇళ్లపై, కార్యాలయాతో పాటు మొత్తం ఏడు చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. అసన్సోల్, కోల్కతా సహా రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి…
Indian-origin Suella Braverman appointed UK Home Secretary: యూకే కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న లిజ్ ట్రస్, కొత్తగా యూకే హోం సెక్రటరీగా భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రవర్మన్ను నియమించారు. లిజ్ ట్రస్ గెలిచిన తర్వాత ఆ పదవిలో ఉన్న ప్రతీ పటేల్ స్థానంలో సుయెల్లా బ్రవర్మన్ను ఈ బాధ్యతలను తీసుకున్నారు. ఈమె పార్లమెంట్ లో ధమ్మపదపై ప్రమాణం చేసి బాధ్యతలను చేపట్టారు.
Why Rishi Sunak lost UK PM race to Liz Truss?: భారత సంతతి వ్యక్తి రిషి సునక్ యూకే ప్రధాని పదవి రేసులో ఓడిపోయారు. లిజ్ ట్రస్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయి.. ప్రధాని పదవిని కోల్పోయారు. అంతకు ముందు యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తరువాత యూకే ప్రధాని పదవి పోటీలో రిషి సునక్ తొలి రౌండ్లలో ముందున్నారు. అయితే తర్వాత రిషి సునక్ తన పాపులారిటీని కోల్పోయారు. అయితే రిషి సునక్ ప్రధాని పదవి…
Diesel Shortage in chennai city: చెన్నై నగరంలో డిజిల్ కొరత ఏర్పడింది. నిర్వాహక లోపాల కారణంగానే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిజిల్ నింపుకోవడానికి వచ్చే వాహనాలతో బంకుల మందు భారీ క్యూ ఏర్పడింది. క్రూడాయిల్ కొరత, పంపిణీ సమస్యల కారణంగా డిజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి డిజిల్ కొరత రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒక్క చెన్నైలోనే కాకుండా తమిళనాడులోని పలు నగరాల్లో కూడా డిజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.