India successfully test-fires Quick Reaction Surface to Air Missile system: భారత అమ్ములపొదిలో కొత్తకొత్త ఆయుధాలు, క్షిపణులు, క్షిపణి నిరోధక వ్యవస్థలు చేరుతున్నాయి. పూర్తిగా మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద పలు అత్యాధునిక ఆయుధాలను రూపొందిస్తోంది ఇండియా. తాజాగా క్విక్ రియాక్షన్ సర్ఫెస్ టూ ఎయిర్ మిస్సైల్(క్యూఆర్ఎస్ఏఎం) వ్యవస్థ పరీక్ష విజయవంతం అయింది. ఈ విషయాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) గురువారం వెల్లడించింది.
US Approves Sale Of F-16 Fleet To Pakistan: అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య మరోసారి సైనిక బంధం బలపడుతోంది. నాలుగేళ్ల తరువాతా అమెరికా, పాకిస్తాన్ దేశానికి భద్రత సహాయం చేయనుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కు సహాయపడేందుకు అమెరికా 450 మిలియన్ డాలర్ల ఎఫ్-16 ఫైటర్ జెట్ ప్లీట్ ను అమ్మనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి ప్రెసిడెంట్ బైడెన్ పరిపాలన యంత్రాంగం ఆమోదించింది. 2018లో ఆఫ్ఘన్ తాలిబన్లను,
Corona cases in india: దేశంలో స్వల్పంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,395 మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 33 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఇండియాలో కేవలం 5,379 కొత్త కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. తాజాగా కేసుల సంఖ్య 6 వేలను దాటింది.
Astronomers Discovers 2 Super-Earths: అనంత విశ్వంలో భూమిలాంటి గ్రహాలను కనుక్కునేందుకు అనేక ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. భూమి లాగే నివాసయోగ్యానికి అనుకూలంగా ఉండే గ్రహాలు, భూమి లాగే హాబిటేబుల్ జోన్ లో ఉండే గ్రహాలను గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని ఎక్సో ప్లానెట్స్ ను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిని పోలిన భారీ భూ గ్రహాలను(సూపర్ ఎర్త్) గుర్తించారు. అయితే అవి పూర్తిగా మానవ ఆవాసానికి అనుకూలంగా లేవు. అక్కడ జీవం ఉందా..? లేదా..? అని గుర్తించలేకపోయారు.
Vitamin D supplement doesn’t reduce Covid risk: కరోనా సమయంలో పెద్దలు, పిల్లలు అంతా విటమిన్ ట్యాబ్లెట్లను విరివిగా వాడారు. ముఖ్యంగా విటమిన్-సీ, విటమిన్-డి ట్యాబ్లెట్లు అవసరం లేకున్నా తెగ మింగారు. ఈ రెండు విటమిన్లు కరోనా నుంచి తమను కాపాడుతాయని భావించి చాలా మంది వీటిని తీసుకున్నారు. అవసరం లేకున్నా ముందు జాగ్రత్తగా విటమిన్ మాత్రలను వేసుకున్నారు. దీంతో ఆ సమయంలో విటమిన్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకానొక దశలో మెడికల్ షాపుల్లో, ఆస్పత్రుల్లో విటమిన్ మాత్రలు లేని పరిస్థితి…
Home Minister Security Breach: మహారాష్ట్రలో హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో లోపం ఏర్పడింది. ఓ వ్యక్తి హోం మంత్రి భద్రతను ఉల్లంఘించాడు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వెళ్లారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అయితే ఆ సమయంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హోంశాఖ అధికారిగా నటిస్తూ.. నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతూ అమిత్ షా దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసినట్లు…
Gender Equality-UN Report: ప్రపంచ వ్యాప్తంగా లింగ సమానత్వం ఇంకా సాధ్యపడటం లేదు. ప్రస్తుతం ఉన్న పురోగతి రేటు ప్రకారం పూర్తిస్థాయిలో లింగ సమానత్వం సాధించడానిక మరో 300 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని సంక్షోభాలు అసమానతలను తీవ్రం చేశాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పురోగతి రేటు ప్రకారం చట్టపరమైన రక్షణలో అంతరాలను, వివక్షాపూరిత చట్టాలను తొలగించేందుకు మరో 286 ఏళ్లు పడుతుందని.. అలాగే అధికారం, నాయకత్వ స్థానాల్లో మహిళా ప్రాతినిథ్యానికి మరో 140 ఏళ్లు…
PM Modi will inaugurate Kartavya Path: ప్రధాని నరేంద్రమోదీ నేడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వలసపాలన గుర్తులను చెరిపివేస్తూ.. రాజ్ పథ్ పేరును ‘కర్తవ్యపథ్’గా మార్చారు. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా కర్తవ్యపథ్ ప్రారంభం కాబోతోంది. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించున్నారు. అక్కడే ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభం అయింది. రాహుల్ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వనుంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు.
Supreme Court on Hijab Controversy: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో హిజాబ్ నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు కూడా విద్యాసంస్థల్లో తప్పకుండా యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది.