Kiren Rijiju: జడ్జిలది కాదు.. వ్యవస్థదే తప్పు.. పెండింగ్ కేసులపై న్యాయశాఖ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju comments on pending cases: దేశంలో పెరుగుతున్న కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయమూర్తుల తప్పు కాదని.. వ్యవస్థ తప్పు అని ఆయన అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలను చేస్తోందని అన్నారు. అనవసరమైన, వాడుకలోని చట్టాలను రద్దు చేయడం, కోర్టులో మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంకేతికను వాడటం వంటివి చేస్తూ మెరుగైన వ్యవస్థ వైపే వెళ్తున్నామని అన్నారు.
ఉదయ్పూర్లోని మోహన్లాల్ సుఖాడియా యూనివర్సిటీలో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా: ఎవల్యూషన్ అండ్ లీగల్ పెర్స్పెక్టివ్’ అనే అంశంపై జరిగిన సదస్సులో శనివారం మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం 4.90 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని అన్నారు . ఏ దేశంలో లేదా సమాజంలో ఇన్ని కేసులు పెండింగ్లో ఉండటం మంచిది కాదని ఆయన అన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. న్యాయమూర్తుల పరిస్థితి దారుణంగా ఉందని, ఒక న్యాయమూర్తి ఒక్క రోజులో 50-60 కేసులు పరిష్కరిస్తారని, వారు రోజు కేసులు పరిష్కరిస్తుంటారు, అయితే వచ్చే కేసులు రోజు రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయని అన్నారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Earthquake: జపాన్లో భూకంపం..
కేసులు పెండింగ్ ఎందుకు ఉంటాయని సామాన్యులు అడుగుతుంటారు, అయితే ఒక న్యాయమూర్తి దీని వెనక ఎంత పనిచేస్తారో ప్రజలకు తెలియదని, ఇది న్యాయమూర్తి తప్పు కాదని, వ్యవస్థ తప్పు అని అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి టెక్నాలజీ కీలకం అని, పేపర్ లేస్ గా చేయడానికి దేశవ్యాప్తంగా న్యాయస్థానాలను సాంకేతికతతో సన్నద్ధం చేస్తామని ఆయన అన్నారు. హైకోర్టులు, దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లలో సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని.. ఇప్పటికే కొన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపడుతున్నాయని.. ఇది మంచి విషయం అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థను కాగిత రహితంగా మార్చడము ఇందులో భాగమే అని అన్నారు. ఇది పర్యవరణ పరంగా మేలు చేస్తుందని, గ్రీన్ ఎనర్జీ విషయంలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉందని, ప్రధాని మోదీ ముందు చూపే ఇందుకు కారణం అని అన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..