Khalistan: భారత్పై విషాన్ని చిమ్మిన అమృత్పాల్ సింగ్.. పంజాబ్ స్వతంత్రం అవుతుందని ప్రగల్భాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan sympathiser Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని సవాల్ చేస్తూ హెచ్చరించారు. ఇటీవల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై సాయుధులుగా వచ్చి దాడి చేశారు అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులు. అతని అనుచరుడిని అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఖలిస్తానీ మద్దతుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ ఘటన మరోసారి పంజాబ్ లో ఖలిస్తానీ వేర్పాటువాదం బలపడుతోందని చెబుతోంది. ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ తనను తాను బ్రిందన్ వాలా 2.0గా భావించుకుంటున్నారు.
‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ గా ఉన్న అమృత్ పాల్ తాజాగా భారత్ పై విషాన్ని చిమ్మాడు. ప్రభుత్వాన్నే సవాల్ చేస్తూ హెచ్చరించాడు. అజ్నాలా దాడి హింసాత్మకం కాదని.. అసలు హింస ఇంకా చూడలేదని వార్నింగ్ ఇచ్చారు. మీరు నినాదాలు చేయడాన్ని, జెండాలను ప్రదర్శిండాన్ని హింసగా పరిగణిస్తున్నారని.. ఇది నిజమైన హింస కాదని ఆయన అన్నారు. అణచివేయబడిన ప్రజలు హింసను ఎంచుకుంటారని.. ప్రజలు హింసను చెడ్డది అని అనుకుంటారు కానీ హింస పవిత్రమైనదని కామెంట్స్ చేశారు. మీకు వేరే మార్గం లేనప్పుడు కత్తి పట్టుకోవడం సరైనదని గురుగోవింద్ సింగ్ జీ చెప్పాని అమృత్ పాల్ సింగ్ అన్నారు. ఖలిస్తాన్ సానుభూతిపరుడు పంజాబ్ సంస్కృతిని అణచివేయడం మరియు వనరుల దోపిడీ యొక్క అంతిమ ఫలితం హింస మాత్రమే అని అన్నారు.
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
Read Also: NIA: కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది ఐఎస్ ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు..
మనం భారతీయులమని ఎందుకు చెప్పుకోవాలి, భారతదేశం యొక్క సంస్కృతి ఏమిటి? భారతదేశం యొక్క దుస్తులు ఏమిటి మరియు భారతీయ ఆహారం ఏమిటి? అని ప్రశ్నించాడు. భారతీయులం అనే కథనం నకిలీదని, జాతీయవాదం తాడు చాలా సన్నగా ఉందని ఏ రోజైనా తెగిపోవచ్చని అన్నారు. బలూచిస్తాన్ లో భారత్ చేస్తుందే, జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ చేస్తుందని కామెంట్స్ చేశారు. అజ్నాలా ఘటనపై డీజీపీ గౌరవ్ యాదవ్ చేసి ప్రకటనపై అమృత్ పాల్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వం అజ్నాలా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ప్రజల బలాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి ఏ చర్య తీసుకున్నా ఫలితం ఉండదని అమృతపాల్ మరోసారి పేర్కొన్నారు. కేంద్ర, పంజాబ్ ప్రభుత్వం మమల్ని ఆపలేవని, అలెగ్జాండర్ ఆపలేరు, మొఘలులు, బ్రిటీష్లు దీన్ని అణిచివేయలేకపోయారు, హిందూస్థాన్ కూడా దానిని అణచివేయలేదని ప్రగల్భాలు పలికారు. పంజాబ్ ఏదో రోజు స్వతంత్రం అవుతుందని, ఖలిస్తానీ భావజాలం ఎప్పటికీ చావదని అన్నారు.
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!