Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jharkhand: 12 రోజుల్లో 16 మందిని చంపిన ఏనుగు.. 144 సెక్షన్ విధింపు..
Elephant Kills 16 People In 12 Days: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఏకంగా 12 రోజల్లో 16 మందిని చంపేసింది. మంగళవారం ఒక్క రాంచీ జిల్లాలోని నలుగురిని చంపేసింది. దీంతో ఇట్కీ బ్లాకులో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూదని హెచ్చరించారు. ఇట్కీ బ్లాకులో గ్రామస్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఏ ఏనుగు దగ్గరికి వెళ్లవద్దని డివిజనల్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ తెలిపారు. -
Joe Biden: ఉక్రెయిన్పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..
Joe Biden: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది కావస్తోంది. కాగా, సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలో చర్చలు జరిపారు. సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకునే నియంత ఎప్పటికీ ప్రజల స్వేచ్ఛను తగ్గించలేదని, ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అన్నారు. ఉక్రెయిన్ పర్యటన ముగిసిన తర్వాత పోలాండ్ వచ్చిన బైడెన్ అక్కడి ప్రజలు, ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి మాట్లాడారు. -
IAS vs IPS: సివిల్ సర్వెంట్లు రోహిణి, రూప బదిలీ.. పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం..
Roopa vs Rohini: కర్ణాటకలో కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు తమ పదవులను మరిచి సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా విమర్శలకు దిగడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరికి పోస్టింగులు ఇవ్వలేదు. -
Tomato Shortage: యూకేలో తీవ్రంగా టొమాటోల కొరత.. ఖాళీగా సూపర్ మార్కెట్లు..
Tomato Shortage: ఆర్థిక మందగమనంతో ఇప్పటికే యూకే ఇబ్బందులు పడుతోంది. రానున్న రోజుల్లో ఆర్థికమాంద్యం తప్పదా అనే అనుమానాలు అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ దేశాన్ని టొమాటోల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం యూకేలోని సూపర్ మార్కెట్లలో టొమాటో స్టాల్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. -
Joe Biden: అత్యంత రహస్యంగా బైడెన్ ఉక్రెయిన్ పర్యటన.. ఎయిర్ ఫోర్స్ వన్ లేకుండా.. రైలులో ప్రయాణం..
Biden's top secret visit to Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కాలం గడుస్తోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ లో చలి కాలం ముగింపుకు రావడంతో రానున్న కాలంలో రష్యా మరింతగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత రహస్యంగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇటు అధికారులకు కానీ అటు మీడియాకు కానీ ముందస్తు సమాచారం లేకుండా అత్యంత రహస్యం పర్యటన… -
Delhi: 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తండ్రి, సోదరుడు..
Physical Assault on A Minor Girl: దేశంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అఘాయిత్యాలకు, అత్యాచారాలకు అడ్దుకట్ట పడటం లేదు. రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, అన్నయ్యనే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ ఘటనలో ఫిర్యాదు నమోదైంది. -
JNU: జెఎన్యూలో ఉద్రిక్తత.. పెరియార్, కార్ల్ మార్క్స్ ఫోటోలు ధ్వంసం..
Periyar, Karl Marx photos ‘vandalised’ at JNU: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ)లో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ధ్వంసం చేశారని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది. -
Tipu Sultan Issue: టిప్పు పేరు వాడకండి.. చర్యలు తీసుకుంటామని వారసుల హెచ్చరిక
Tipu Sultan Issue: కర్ణాటక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడ మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టిప్పు సుల్తాన్ ను సమర్థిస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తుండగా.. బీజేపీ టిప్పు సుల్తాన్ ను విమర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు టిప్పు పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై టిప్పు వారసులు స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం టిప్పు సుల్తాన్ పేరు ఉపయోగించవద్దని.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
NIA Raids: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఐటీ రైడ్స్..
NIA, IT raids across the country: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఐటీ డిపార్ట్మెంట్లు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్- టెర్రర్ లింకులపై ఎన్ఐఏ విస్తృతంగా దాడులు చేస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని 72 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ నుంచి సరఫరా చేసిన వస్తువులను కనుక్కున్నారు. గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్-నీర్జ్… -
Maoist Warning: కాంగ్రెస్ పార్టీకి మావోయిస్టుల వార్నింగ్..
Maoists warning letter to Congress: మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతూ చత్తీస్ ఘడ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోహన్ పేరుతో లేఖను విడుదల చేశారు. చత్తీస్ ఘడ్ లో సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించింది మావోయిస్టు పార్టీ.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!