Death Penalty: “ఉరితీసే విధానం”పై కమిటీ ఏర్పాటు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Penalty: ఉరితీసే విధానంపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం ఉరితీసే విధానం అమలులో ఉంది. అయితే దీన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయిన కేంద్రం తరుపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వెల్లడించారు.
Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఇండియాలో మరణశిక్ష పడిన ఖైదీలకు ‘ఉరితీసే’ విధానం ద్వారానే శిక్షను అమలు చేస్తున్నారు. అయితే ఈ పద్ధతి సరైనదేనా..? ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా..? అనే అంశాలను పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సలహా ఇచ్చింది. కాగా.. ఈ సలహాను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ లో సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ప్రస్తుతం కేంద్రం దీనిపై చర్చిస్తోంది. దీనిపై స్పందించేందుకు మరింత సమయం కావాలి అని అటార్నీ జనరల్ తెలిపారు. ఇందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. సీజైఐతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణ తేదీని వేసవి సెలవుల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.
మరణశిక్ష అమలు చేసే పద్ధతిలో రాజ్యాంగబద్ధతనను సవాల్ చేస్తూ న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా వంటి దేశాల్లో ఇంజెక్షన్ ద్వారా మరణిశిక్షను అమలు చేస్తున్నారు. దీంతో పోలిస్తే ఉరితీయడం అత్యంత క్రూరమైన, దారుణమైన విధానం అని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఉరిశిక్ష అమలుకు మానవీయ పద్ధతుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయనే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచింది. దీనిపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..