Mars: అంగారకుడిపై నీటి జాడలను గుర్తించిన చైనా రోవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది. అంగారకుడి రహస్యలను తెలుసుకునేందుకు చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాసా, చైనా, యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్లు అనేక రోవర్లను అంగారకుడిపైకి పంపాయి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం సముద్రం, నదులు ఏర్పరిచిన గుర్తులను ఇవి గుర్తించాయి.
ఇదిలా ఉంటే అంగారకుడిపైకి 2021లో చైనా జురాంగ్ అనే రోవర్ ను పంపింది. ప్రస్తుతం ఈ రోవర్ అంగారకుడిపైకి భూమధ్య రేఖ వైపు, ధృవాలకు దూరంగా ఉన్న ఇసుక దిబ్బలపై లిక్విడ్ వాటర్ కు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించింది. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడిపై పెద్ద సముద్రాలు, నదులు ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంగారకుడి అంతర్భాగంలో జరిగిన మార్పులు, ఆ గ్రహంపై అయస్కాంత క్షేత్రాన్ని బలహీన పరచడంతో అక్కడి వాతావరణం, నీరు నెమ్మనెమ్మదిగా విశ్వంలో కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే..భూమధ్య రేఖకు దగ్గరగా తక్కువ అక్షాంశాల వద్ద ద్రవ నీటి ఉనికికి సంబంధించి ఈ రోజు వరకు ఎలాంటి ఆధారాలు అందించబడలేదు.
Also Read
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
Read Also: Ukraine ‘Maa Kali’ tweet: “కాళీ మాత” ఫోటోతో వివాదాస్పద ట్వీట్ చేసిన ఉక్రెయిన్.. భారతీయుల ఆగ్రహం
తాజా పరిశోధన ఇప్పుడు మార్స్ పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద పురోగతిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం జురాంగ్ పంపిన డేటాను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. రోవర్ నేరుగా మంచు లేదా మంచు రూపంలోని నీటిని గుర్తించలేదని, బదులుగా పగుళ్లు, క్రస్ట్ లతో ఉప్పు అధికంగా ఉండే దిబ్బలను గుర్తించిందని తెలిపారు. రోవర్ మొదటిసారిగా అంగారకుడి దిబ్బలపై పగిలిన పొరను కనుగొంది. ఇది రెడ్ ప్లానెట్ పై 4,00,000 ఏళ్ల క్రితం ఉప్పు సమృద్ధిగా ఉన్న నీటి ప్రపంచాన్ని సూచిస్తుందని అధ్యయనం తెలిపింది. అంగారకుడిపై ఉష్ణోగ్రతల్లో హెచ్చతగ్గులు మారుతుంటాయి కాబట్టి ఉప్పునీరు ఆవిరై ఉప్పు, కొన్ని ఖనిజలవణాలు మిగిలి ఉంటాయని చైనా పరిశోధకులు భావిస్తున్నారు.
రోబోటిక్ రోవర్ యొక్క నావిగేషన్ మరియు టెర్రైన్ కెమెరా, మల్టీస్పెక్ట్రల్ కెమెరా మరియు మార్స్ సర్ఫేస్ కంపోజిషన్ డిటెక్టర్ ద్వారా ఈ డేటాను శాస్త్రవేత్తలు పొందారు. మట్టి దిబ్బల పొరల్లో హైడ్రేటెడ్ సల్ఫేట్లు, హైడ్రేటెడ్ సిలికా, ఐరన్ ఆక్సైడ్ ఖనిజాలు మరియు బహుశా క్లోరైడ్లు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!