Mars: అంగారకుడిపై నీటి జాడలను గుర్తించిన చైనా రోవర్..
Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది. అంగారకుడి రహస్యలను తెలుసుకునేందుకు చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాసా, చైనా, యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్లు అనేక రోవర్లను అంగారకుడిపైకి పంపాయి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం సముద్రం, నదులు ఏర్పరిచిన గుర్తులను ఇవి గుర్తించాయి.
ఇదిలా ఉంటే అంగారకుడిపైకి 2021లో చైనా జురాంగ్ అనే రోవర్ ను పంపింది. ప్రస్తుతం ఈ రోవర్ అంగారకుడిపైకి భూమధ్య రేఖ వైపు, ధృవాలకు దూరంగా ఉన్న ఇసుక దిబ్బలపై లిక్విడ్ వాటర్ కు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించింది. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడిపై పెద్ద సముద్రాలు, నదులు ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంగారకుడి అంతర్భాగంలో జరిగిన మార్పులు, ఆ గ్రహంపై అయస్కాంత క్షేత్రాన్ని బలహీన పరచడంతో అక్కడి వాతావరణం, నీరు నెమ్మనెమ్మదిగా విశ్వంలో కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే..భూమధ్య రేఖకు దగ్గరగా తక్కువ అక్షాంశాల వద్ద ద్రవ నీటి ఉనికికి సంబంధించి ఈ రోజు వరకు ఎలాంటి ఆధారాలు అందించబడలేదు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
Read Also: Ukraine ‘Maa Kali’ tweet: “కాళీ మాత” ఫోటోతో వివాదాస్పద ట్వీట్ చేసిన ఉక్రెయిన్.. భారతీయుల ఆగ్రహం
తాజా పరిశోధన ఇప్పుడు మార్స్ పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద పురోగతిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం జురాంగ్ పంపిన డేటాను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. రోవర్ నేరుగా మంచు లేదా మంచు రూపంలోని నీటిని గుర్తించలేదని, బదులుగా పగుళ్లు, క్రస్ట్ లతో ఉప్పు అధికంగా ఉండే దిబ్బలను గుర్తించిందని తెలిపారు. రోవర్ మొదటిసారిగా అంగారకుడి దిబ్బలపై పగిలిన పొరను కనుగొంది. ఇది రెడ్ ప్లానెట్ పై 4,00,000 ఏళ్ల క్రితం ఉప్పు సమృద్ధిగా ఉన్న నీటి ప్రపంచాన్ని సూచిస్తుందని అధ్యయనం తెలిపింది. అంగారకుడిపై ఉష్ణోగ్రతల్లో హెచ్చతగ్గులు మారుతుంటాయి కాబట్టి ఉప్పునీరు ఆవిరై ఉప్పు, కొన్ని ఖనిజలవణాలు మిగిలి ఉంటాయని చైనా పరిశోధకులు భావిస్తున్నారు.
రోబోటిక్ రోవర్ యొక్క నావిగేషన్ మరియు టెర్రైన్ కెమెరా, మల్టీస్పెక్ట్రల్ కెమెరా మరియు మార్స్ సర్ఫేస్ కంపోజిషన్ డిటెక్టర్ ద్వారా ఈ డేటాను శాస్త్రవేత్తలు పొందారు. మట్టి దిబ్బల పొరల్లో హైడ్రేటెడ్ సల్ఫేట్లు, హైడ్రేటెడ్ సిలికా, ఐరన్ ఆక్సైడ్ ఖనిజాలు మరియు బహుశా క్లోరైడ్లు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో