Rahul Gandhi: “కేవలం తన గురించి మాత్రమే మాట్లాడుతాడు”.. ప్రధానిపై రాహుల్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్రమోదీ, జేపీనడ్డా, అమిత్ షాలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మంగళవారం తీర్థహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ కర్ణాటకలో కూడా తన గురించే మాట్లాడుతున్నారని, కర్ణాటక అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, తన పార్టీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేరును ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. మే 10న కర్ణాటకలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడీకి సంబంధించినవి కాదని, మన పిల్లలు, వారి భవిష్యత్తు కోసమే అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్లను ప్రస్తావిస్తుందని, కానీ బీజేపీ మాత్రం ఎవరిపేర్లను ప్రస్తావించడని ఆయన అన్నారు. మోడీ వారి నాయకుల గురించి ఎప్పటికి మాట్లాడరని అన్నారు. సబ్-ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ సమయంలో విపరీతమైన అవినీతి జరిగిందని, అందుకనే ప్రధాని మోడీ, హోం మంత్రి పేరును ఎప్పడు ప్రస్తావించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు.
మోడీ తన గురించి తప్పితే వేరే వాటి గురించి మాట్లాడటం లేదని, కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, కర్ణాటక ప్రజలు, అభివృద్ధి గురించి మాట్లాటం లేదని ఆయ ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాని ఏం చేసిందో కూడా చెప్పడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అవినీతిని అంతం చేయడానికి ఏం చేశారో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రతీ పనిపై 40 శాతం కమిషన్లు తీసుకుని అవినీతికి పాల్పడిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!