Rahul Gandhi: “కేవలం తన గురించి మాత్రమే మాట్లాడుతాడు”.. ప్రధానిపై రాహుల్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్రమోదీ, జేపీనడ్డా, అమిత్ షాలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మంగళవారం తీర్థహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ కర్ణాటకలో కూడా తన గురించే మాట్లాడుతున్నారని, కర్ణాటక అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, తన పార్టీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేరును ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. మే 10న కర్ణాటకలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడీకి సంబంధించినవి కాదని, మన పిల్లలు, వారి భవిష్యత్తు కోసమే అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్లను ప్రస్తావిస్తుందని, కానీ బీజేపీ మాత్రం ఎవరిపేర్లను ప్రస్తావించడని ఆయన అన్నారు. మోడీ వారి నాయకుల గురించి ఎప్పటికి మాట్లాడరని అన్నారు. సబ్-ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ సమయంలో విపరీతమైన అవినీతి జరిగిందని, అందుకనే ప్రధాని మోడీ, హోం మంత్రి పేరును ఎప్పడు ప్రస్తావించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు.
మోడీ తన గురించి తప్పితే వేరే వాటి గురించి మాట్లాడటం లేదని, కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, కర్ణాటక ప్రజలు, అభివృద్ధి గురించి మాట్లాటం లేదని ఆయ ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాని ఏం చేసిందో కూడా చెప్పడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అవినీతిని అంతం చేయడానికి ఏం చేశారో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రతీ పనిపై 40 శాతం కమిషన్లు తీసుకుని అవినీతికి పాల్పడిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!