Rahul Gandhi: “కేవలం తన గురించి మాత్రమే మాట్లాడుతాడు”.. ప్రధానిపై రాహుల్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్రమోదీ, జేపీనడ్డా, అమిత్ షాలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మంగళవారం తీర్థహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ కర్ణాటకలో కూడా తన గురించే మాట్లాడుతున్నారని, కర్ణాటక అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, తన పార్టీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేరును ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. మే 10న కర్ణాటకలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడీకి సంబంధించినవి కాదని, మన పిల్లలు, వారి భవిష్యత్తు కోసమే అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్లను ప్రస్తావిస్తుందని, కానీ బీజేపీ మాత్రం ఎవరిపేర్లను ప్రస్తావించడని ఆయన అన్నారు. మోడీ వారి నాయకుల గురించి ఎప్పటికి మాట్లాడరని అన్నారు. సబ్-ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ సమయంలో విపరీతమైన అవినీతి జరిగిందని, అందుకనే ప్రధాని మోడీ, హోం మంత్రి పేరును ఎప్పడు ప్రస్తావించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు.
మోడీ తన గురించి తప్పితే వేరే వాటి గురించి మాట్లాడటం లేదని, కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, కర్ణాటక ప్రజలు, అభివృద్ధి గురించి మాట్లాటం లేదని ఆయ ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాని ఏం చేసిందో కూడా చెప్పడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అవినీతిని అంతం చేయడానికి ఏం చేశారో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రతీ పనిపై 40 శాతం కమిషన్లు తీసుకుని అవినీతికి పాల్పడిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!