Rahul Gandhi: “కేవలం తన గురించి మాత్రమే మాట్లాడుతాడు”.. ప్రధానిపై రాహుల్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్రమోదీ, జేపీనడ్డా, అమిత్ షాలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మంగళవారం తీర్థహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ కర్ణాటకలో కూడా తన గురించే మాట్లాడుతున్నారని, కర్ణాటక అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, తన పార్టీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేరును ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ప్రశ్నించారు. మే 10న కర్ణాటకలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడీకి సంబంధించినవి కాదని, మన పిల్లలు, వారి భవిష్యత్తు కోసమే అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
- West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్లను ప్రస్తావిస్తుందని, కానీ బీజేపీ మాత్రం ఎవరిపేర్లను ప్రస్తావించడని ఆయన అన్నారు. మోడీ వారి నాయకుల గురించి ఎప్పటికి మాట్లాడరని అన్నారు. సబ్-ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ సమయంలో విపరీతమైన అవినీతి జరిగిందని, అందుకనే ప్రధాని మోడీ, హోం మంత్రి పేరును ఎప్పడు ప్రస్తావించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు.
మోడీ తన గురించి తప్పితే వేరే వాటి గురించి మాట్లాడటం లేదని, కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, కర్ణాటక ప్రజలు, అభివృద్ధి గురించి మాట్లాటం లేదని ఆయ ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాని ఏం చేసిందో కూడా చెప్పడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అవినీతిని అంతం చేయడానికి ఏం చేశారో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రతీ పనిపై 40 శాతం కమిషన్లు తీసుకుని అవినీతికి పాల్పడిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..