Girl Friend On Rent: చైనాలో జనాభా వృద్ధి గణనీయంగా తగ్గిపోతోంది. 30 ఏళ్లు నిండిన యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు. ఒంటరి జీవితానికే ఓటేస్తున్నారు. దీంతో సంతానోత్పత్తి రేటు తగ్గడంతో జనాభా వృద్ధి తగ్గుతోంది. గత 40 ఏళ్లతో పోలిస్తే 2022లో అతి తక్కువ జనాభా వృద్ధి చైనాలో నమోదు అయింది. వన్ చైల్డ్ విధానం కూడా ఇందుకు ఓ కారణం అయింది. దీంతో ఇప్పుడు చైనాలో ముసలి జనాభా పెరిగింది.
Jinping Russia Visit: ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆధిపత్యం రష్యా, చైనాలను మరింత దగ్గర చేస్తోంది. నాటోకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు మరో కూటమిని కట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో జపాన్ ప్రధాని కిషిడా ఉక్రెయిన్ లో పర్యటించడం ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోతున్న విషయం కనిపిస్తోంది.
Russia: రష్యా-ఉక్రెయిన్ యద్ధాన్ని విమర్శించి పాప్ స్టార్ డిమానోవా(35) ఓ నది ప్రమాదంలో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆయన అసలు పేరు డిమిత్రి స్వర్గునోవ్. ఆయన ప్రముఖ సంస్థ క్రీమ్ సోడా వ్యవస్థాపకుడు. డీమానోవా తన సోదరుడు ముగ్గరు స్నేహితులతో కలిసి మార్చి 19న గడ్డకట్టిన వోల్గా నది దాటుతుండగా మంచులో పడిపోయి మరణించారు. అతడి ఇద్దరు స్నేహితులను రక్షించగా.. మూడో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.
Tipu Sultan: టిప్పు సుల్తాన్ ను ఎవరు చంపారు..? ఇప్పుడు కర్ణాటకలో మరో వివాదం ముందుకు వచ్చింది. కర్ణాకటలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి వీడీ సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్ గా రాజకీయం కొనసాగుతోంది. బీజేపీ సావర్కర్ పేరుతో ఇతర పార్టీలపై విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ వొక్కలిగ వర్గాన్ని దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
Indian Mission In UK: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు హైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ అణిచివేతకు వ్యతిరేకంగా బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి భారత రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు.
Earthquake: వరస భూకంపాలతో ఉత్తర భారతదేశం వణుకుతోంది. ఒక్క మార్చి నెలలోనే రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతతో 6 భూకంపాలు వచ్చాయి. ఫిబ్రవరి నుంచి లేక్కేస్తే 10 భూకంపాలు వచ్చాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వణికించింది. తాజా భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ లని హిందూకుష్ ప్రాంతంలో నమోదు అయింది. ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్, భారత్ లో దీని ప్రకంపనలు కనిపించాయి.
Supreme Court: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్సిస్ బానో న్యాయవాది శోభా గుప్తా వెల్లడించారు.
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు ఐఫోన్లు వాడొద్దనే ఆదేశాలు అధికారులకు వెళ్లాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అమెరికా తయారీ ఐఫోన్ కావడంతో పాశ్చాత్య దేశాలు నిఘా పెంచే అవకాశం ఉండటంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవి కొనొద్దని, ఉన్నవాటిని పక్కన పారేయాలని అధికారులను ఆదేశించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ పలు రాష్ట్రాల ప్రజలకు కొత్త సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆనందం, శ్రేయస్సును ఆయన ఆకాంక్షించారు. వరసగా వివిధ రాష్ట్రాల సంప్రదాయ కొత్త సంవత్సరంపై ట్వీట్స్ చేశారు.
Ram Navami Procession: శ్రీరామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించడంపై జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హజారీబాగ్ లో రామనమవి ఉరేగింపుల్లో డీజే వాడొద్దని, సంప్రాదాయ కర్రల విన్యాసాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బీజేపీ సభ్యులు జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. జార్ఖండ్ రాష్ట్రం తాలిబాన్ల పాలనలో ఉందా.? అంటూ బీజేపీ సభ్యులు ప్రశ్నించారు.