Venu Goapl Reddy
Author- NTV Telugu-
Rahul Gandhi: కార్పెంటర్గా మారిన రాహుల్ గాంధీ..
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్పెంటర్ అవతారం ఎత్తారు. ఇటీవల పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ సామాన్య ప్రజానీకంతో మమేకం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూలీగా మారి సూట్కేస్ నెత్తిన పెట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా గురువారం రోజు ఆసియాలో అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్ అయిన ఢిల్లీలోని కీర్తీనగర్ మార్కెట్ లో కార్మికులు, కార్పెంటర్లతో ముచ్చటించారు. మార్కెట్ సందర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. -
Ujjain Case: ఉజ్జయిని మైనర్ రేప్ కేసు.. తప్పించుకునేందుకు నిందితుడి యత్నం..
Ujjain Case: ఉజ్జయిని అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలతో రక్తం కారుతూ, అర్ధనగ్నంగా సాయం కోసం ధీనంగా బతిమిలాడుతున్న వీడియో వైరల్ గా మారింది. ఓ ఇంటి ముందుకు వెళ్లి సాయం కోరం సదరు వ్యక్తి తరిమివేయడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. బాలిక పరిస్థితిని చూసి పలువురు రూ.50,100 ఇవ్వడానికి ప్రయత్నించారు. చివరకు ఓ పూజారి బాలిక పరిస్థితిని చూసి కొత్త బట్టలు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించారు. -
Mobile Usage: మొబైళ్లకు అతుక్కుపోతున్న పిల్లలు.. రోజుకు 4 గంటలు సెల్ఫోన్ లోనే..
Mobile Usage: ఇటీవల కాలంలో పిల్లల్లో మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. అన్నం తినడానికి మారం చేస్తున్నారనో..తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లను ఇస్తున్నారు. అయితే ఇదే అలవాటుగా మారి పిల్లలు దానికి అడిక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఇష్టపడటం లేదు, స్కూల్ నుంచి వచ్చిందంటే చాలు సెల్ ఫోన్లపై పడుతున్నారు. యూట్యూబ్, గేమ్స్ ఇలా వాటితో కాలక్షేపం చేస్తున్నారు. -
Canada: కెనడా ఆర్మీ వెబ్సైట్పై భారత హ్యాకర్ల దాడి..?
Canada: కెనడా ఆర్మీ వెబ్సైట్ పై భారత హ్యకర్తు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కెనడా ఆర్ముడ్ ఫోర్సెస్ అధికారిక వెబ్సైట్ బుధవారం తాత్కాలికంగా నిలిపేవారు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఈ వెబ్సైట్ పై ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యకర్ల టీం హ్యాక్ చేసింది, దీనికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించిందని తెలిపింది. -
Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం పొదుపు చేస్తే.. రూ.18 లక్షలను మాయం చేసిన చెదలు..
Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం ఓ తల్లి దాచుకున్న డబ్బులన్నీ చెదలు పట్టాయి. ఏకంగా రూ.18 లక్షలని చెదలు మాయం చేశాయి. ఒక్క రూపాయి కూడా లేకుండా చెదలు మొత్తం డబ్బుల్ని కొట్టాయి. అయితే ఇదంతా బాధితురాలు ఇంట్లో కాదు. బ్యాంకు లాకర్ లో ఉన్న డబ్బులకు చెదలు పట్టాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొరాదాబాద్లో జరిగింది. -
Punjab: వ్యక్తి కడుపులో ఇయర్ ఫోన్స్, తాళాలు.. అవాక్కైన వైద్యులు..
Punjab: పంజాబ్లో ఓ వ్యక్తి కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కవ్వడం డాక్టర్ల వంతైంది. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కడుపులో ఏకంగా తాళాలు, ఇయర్ ఫోన్స్, బోల్టులు, నట్స్, వాషర్లు ఇలా అనేక వస్తువులను డాక్టర్లు గుర్తించారు. గత రెండేళ్లుగా సదరు వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. కడుపునొప్పి, జ్వరం, వాంతులు ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుూ ఇటీవల మోగాలోని మెడిసిటీ ఆస్పత్రికి వచ్చాడు. -
Vivek Ramaswamy: ట్రంప్ దారిలో వివేక్ రామస్వామి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
Vivek Ramaswamy: అమెరికన్ అధ్యక్ష ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో పోటీ రసవత్తరంగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలి వంటి వారు అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో నిలబడ్డారు. అయితే ట్రంప్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు. -
Lizard In Meal: స్కూల్ భోజనంలో బల్లి.. 110 మంది విద్యార్థులకు అస్వస్థత
Jharkhand: జార్ఖండ్ లో పాకూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏకంగా 110 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గురువారం అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్తులు వాంతులు, తలనొప్పిగా ఉందని ఫిర్యాదు చేశారు. భోజనంలో బల్లి పడటంతోనే ఇలా అయిందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. -
Hafiz Saeed: ముంబై దాడుల ఉగ్రవాది కుమారుడు మిస్సింగ్.. గజగజ వణుకుతున్న పాకిస్తాన్..
Hafiz Saeed: దాయాది దేశం పాకిస్తాన్ లో ఏదో జరుగుతోంది వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమవుతున్నారు. దీంతో అక్కడ ఉన్న ఉగ్రవాదుల్లో భయం మొదలైంది. రెండుమూడు రోజుల క్రితం జియావుర్ రెహ్మన్ అనే హిజ్బుల్ ముజాహిద్ధీన్ ఉగ్రవాదిన కరాచీలో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి ఆయన్ని హతమార్చారు. కాశ్మీర్ లో హిజ్బుల్ తరుపున ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసే పనిని ఈ ఉగ్రవాది చేసేవాడు. -
US Visa: రికార్డ్ బద్ధలు..ఈ ఏడాది 10 లక్షల భారతీయులకు అమెరికా వీసాలు..
US Visa: భారత్, అమెరికాల మధ్య ఇటీవల కాలంలో బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో భారతదేశానికి అగ్రరాజ్యం పెద్దపీట వేస్తోంది. భారతీయులకు వీసాలను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది 10 లక్షల మంది భారతీయులకు అమెరికా వీసాలను మంజూరు అయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికార సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అన్ని రకాల వీసాలు కలిసి ఈ రికార్డు నమోదైంది.
తాజావార్తలు
-
IND vs ZIM 2nd T20: సిరీస్పై కన్నేసిన టీమిండియా.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.!
-
NEET Protest Talks Today: నేడు సీజేపీ-ప్రభుత్వం మధ్య మూడో విడత చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఉత్కంఠ
-
Ramayana Promotion Budget: ప్రమోషన్స్ కోసం కళ్లు చెదిరే బడ్జెట్.. ప్రపంచాన్ని టార్గెట్ చేసిన రామాయణం!
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి మెడల్.. పేదరికాన్ని జయించి కాంస్య పతకం సాధించిన ఝండు కుమార్
-
SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!