Tipu Sultan: టిప్పు సుల్తాన్ను ఎవరు చంపారు..? కర్ణాటకలో మరో కాంట్రవర్సీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tipu Sultan: టిప్పు సుల్తాన్ ను ఎవరు చంపారు..? ఇప్పుడు కర్ణాటకలో మరో వివాదం ముందుకు వచ్చింది. కర్ణాకటలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి వీడీ సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్ గా రాజకీయం కొనసాగుతోంది. బీజేపీ సావర్కర్ పేరుతో ఇతర పార్టీలపై విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ వొక్కలిగ వర్గాన్ని దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
టిప్పు సుల్తాన్ ను బ్రిటిష్, మరాఠా సైన్యం చంపలేదని ఇద్దరు వొక్కలిగ నాయకులు చంపారని బీజేపీ వాదిస్తోంది. ఈ వాదనపై బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. వొక్కలిగ నాయకులు ఊరిగౌడ, నంజే గౌడ ఇద్దరు చంపారని బీజేపీతో పాటు ఓ వర్గం అంటోంది. అడ్డంగ కరియప్ప రచించిన టిప్పు నిజకనాసుగలు( టిప్పు నిజమైన కలలు) పుస్తకం ఆధారంగా బీజేపీ ఈ వాదనలు చేస్తోంది. అయితే దీన్ని పలువరు చరిత్రకారులు వ్యతిరేకించినప్పటికీ, వొక్కలిగా బీజేపీ నాయకులు అయిన సీటీ రవి, మంత్రులు అశ్వత్ నారాయన్, గోపాలయ్య సమర్థించారు. ఊరి గౌడ, నంజే గౌడ గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్న వారిలో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే, అశ్వత్ నారాయణ వంటి బీజేపీ నేతలు కూడా ఉన్నారు.
Also Read
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
Read Also: UK: భారత జెండాను చూసి ఖలిస్తానీలకు మంట.. మరోసారి హైకమిషన్ పై దాడి..
వొక్కలిగా సామాజికవర్గం ఇప్పటి వరక కాంగ్రెస్, కుమారస్వామి పార్టీ జనతాదళ్ సెక్యులర్కు మద్దతుగా ఉంది. అయితే ఊరి గౌడ, నంజే గౌడ ఉనికిలో లేరని, కేవలం కల్పిత పాత్రలే కావొచ్చని రెండు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రమంత్రి మునియప్ప నిర్మాతగా మారి.. ‘‘ఉరిగౌడ, నంజేగౌడ’’ సినిమా తీయనున్నట్లు చెప్పారు. వొక్కలిగ గురువుగా భావించే శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం ప్రధాన పీఠాధిపతి నిర్మలానందనాథ మహాస్వామీజీ సినిమా తీసేముందు దీనికి సంబంధించిన శాసనాలు, చారిత్రక ఆధారాలు మఠానికి సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
టిప్పు సుల్తాన్ వేల మందిని చంపి బలవంతంగా మతం మార్చాడని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, జేడీయూలు ఈ వాదనలను తోసిపుచ్చుతున్నాయి. గతంలో టిప్పు జన్మదినోత్సవాన్ని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. తాజాగా ఈ అంశం ఎన్నికల ప్రధాన నినాదంగా మారింది. ఏప్రిల్-మేలో కర్నాటకలో 224 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఇందులో బీజేపీ గెలిచి వరుసగా రెండవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.
తాజావార్తలు
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!