Earthquake: మార్చి నెలలో 6 భూకంపాలు.. ఉత్తరాదిని వణికిస్తున్న ప్రకంపనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: వరస భూకంపాలతో ఉత్తర భారతదేశం వణుకుతోంది. ఒక్క మార్చి నెలలోనే రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతతో 6 భూకంపాలు వచ్చాయి. ఫిబ్రవరి నుంచి లేక్కేస్తే 10 భూకంపాలు వచ్చాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వణికించింది. తాజా భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ లని హిందూకుష్ ప్రాంతంలో నమోదు అయింది. ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్, భారత్ లో దీని ప్రకంపనలు కనిపించాయి.
Read Also: Illegal Relationship : తల్లి ప్రియుడిని చంపిన కొడుకు.. జార్ఖండ్లో ఘోరం
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
- BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
అసలెందుకు భూకంపాలు వస్తున్నాయి:
శాస్త్రవేత్తల ప్రకారం పశ్చిమ హిమాలయాలు అంటే ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ కుష్ పర్వతాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న హిమాలయ ప్రాంతం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. అయితే ప్రాంతంలో భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా అవుతున్నాయి. కొన్ని లక్షల ఏళ్ల క్రితం భారత ఉపఖండం టెక్టానిక్ ప్లేట్ యూరేసియా టెక్టానిక్ ప్లేట్ ను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ నిరంతం జరుగుతుంటుంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరంగా కదులుతూ యూరేసియా టెక్టానిక్ ప్లేట్ ను ముందుకు నెట్టుతోంది.
ఈ ప్రక్రియలో విడుదలైన శక్తి భూకంపాల రూపంలో కనిపిస్తోంది. ఓ అంచనా ప్రకారం ఎప్పుడో రోజు 8 తీవ్రతతో ఈ ప్రాంతంలో భారీ భూకంపం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మనదేశంలో భూకంపం వచ్చే ప్రాంతాలను 4 ప్రాంతాలుగా విభజించారు.
జోన్ 1 తక్కువ-తీవ్రత వర్గం కిందకు వస్తుంది మరియు ఇది కర్ణాటక పీఠభూమి వెంబడి ఉంది.
జోన్ 2 కేరళ, గోవా మరియు లక్షద్వీప్ దీవులతో పాటు పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు భూకంపం వచ్చే అవకాశం.
జోన్ 3 అధిక తీవ్రతతో కూడిన భూకంపాలకు సంబంధించినది. ఇది జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ-ఎన్సిఆర్, సిక్కిం, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ యొక్క ఉత్తర ప్రాంతాలు, మహారాష్ట్ర మరియు రాజస్థాన్ యొక్క పశ్చిమ తీరాన్ని కలిగి ఉంది.
జోన్ 4 ఉత్తర బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులను కవర్ చేసే అత్యంత తీవ్రమైన భూకంపాలకు సంబంధించినది.
తాజావార్తలు
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!