Jharkhand: శ్రీరామ నవమి ఊరేగింపుపై నిషేధం.. తాలిబాన్ పాలనలో ఉన్నామా అంటూ బీజేపీ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Navami Procession: శ్రీరామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించడంపై జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హజారీబాగ్ లో రామనమవి ఉరేగింపుల్లో డీజే వాడొద్దని, సంప్రాదాయ కర్రల విన్యాసాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బీజేపీ సభ్యులు జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. జార్ఖండ్ రాష్ట్రం తాలిబాన్ల పాలనలో ఉందా.? అంటూ బీజేపీ సభ్యులు ప్రశ్నించారు.
Read Also: COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
హజారీబాగ్లోని రామనవమి ఊరేగింపులో డీజేని అనుమతించాలని బీజేపీ శాసనసభ్యుడు మనీష్ జైస్వాల్ డిమాండ్ చేశారు. ఉద్వేగానికి గురైన ఎమ్మెల్యే మనీష్ జైస్వాత్ తన కుర్తాను చించుకున్నారు. తాలిబాన్లు పాలించే రాష్ట్రంలో ప్రజలు నివసిస్తున్నారా..? అంటూ ఆశ్చర్యపోయారు. తన నియోజకవర్గం హాజారీ బాగ్ లో ఊరేగింపు సమయంలో డీజేని అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఐదుగురు వ్యక్తులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అమాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆరోపించారు.
హజారీబాగ్లో 104 ఏళ్ల రామనవమి ఊరేగింపు సంప్రదాయాన్ని ధ్వంసం చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోందని జైస్వాల్ ఆరోపించారు. హజారీ బాగ్ లో డీజే పెట్టాలని కోరతూ ధర్నా చేసేవారు బీజేపీ కార్యకర్తలు అని మంత్రి మిథిలేష్ ఠాకూర్ ఆరోపించారు. లౌడ్ స్పీకర్ల శబ్ధ తీవ్రంతపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను పాటించాలనే ఆదేశాలు ఉన్నాయని, హిందూ, ముస్లిం, సిక్కు, క్రిష్టియన్ అన్ని మతాలను మేం గౌరవిస్తున్నామని, మేమే నిజమైన రామభక్తులమని మంత్రి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల వందల మంది హాజారీబాగ్ లో ర్యాలీ నిర్వహించారు. ఇతర ప్రాంతాలలో పోలిస్తే ఇక్కడ రామనవమి వేడుకలు ఎక్కువ రోజులు జరుగుతాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!