Jharkhand: శ్రీరామ నవమి ఊరేగింపుపై నిషేధం.. తాలిబాన్ పాలనలో ఉన్నామా అంటూ బీజేపీ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Navami Procession: శ్రీరామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించడంపై జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హజారీబాగ్ లో రామనమవి ఉరేగింపుల్లో డీజే వాడొద్దని, సంప్రాదాయ కర్రల విన్యాసాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బీజేపీ సభ్యులు జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. జార్ఖండ్ రాష్ట్రం తాలిబాన్ల పాలనలో ఉందా.? అంటూ బీజేపీ సభ్యులు ప్రశ్నించారు.
Read Also: COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
హజారీబాగ్లోని రామనవమి ఊరేగింపులో డీజేని అనుమతించాలని బీజేపీ శాసనసభ్యుడు మనీష్ జైస్వాల్ డిమాండ్ చేశారు. ఉద్వేగానికి గురైన ఎమ్మెల్యే మనీష్ జైస్వాత్ తన కుర్తాను చించుకున్నారు. తాలిబాన్లు పాలించే రాష్ట్రంలో ప్రజలు నివసిస్తున్నారా..? అంటూ ఆశ్చర్యపోయారు. తన నియోజకవర్గం హాజారీ బాగ్ లో ఊరేగింపు సమయంలో డీజేని అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఐదుగురు వ్యక్తులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అమాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆరోపించారు.
హజారీబాగ్లో 104 ఏళ్ల రామనవమి ఊరేగింపు సంప్రదాయాన్ని ధ్వంసం చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోందని జైస్వాల్ ఆరోపించారు. హజారీ బాగ్ లో డీజే పెట్టాలని కోరతూ ధర్నా చేసేవారు బీజేపీ కార్యకర్తలు అని మంత్రి మిథిలేష్ ఠాకూర్ ఆరోపించారు. లౌడ్ స్పీకర్ల శబ్ధ తీవ్రంతపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను పాటించాలనే ఆదేశాలు ఉన్నాయని, హిందూ, ముస్లిం, సిక్కు, క్రిష్టియన్ అన్ని మతాలను మేం గౌరవిస్తున్నామని, మేమే నిజమైన రామభక్తులమని మంత్రి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల వందల మంది హాజారీబాగ్ లో ర్యాలీ నిర్వహించారు. ఇతర ప్రాంతాలలో పోలిస్తే ఇక్కడ రామనవమి వేడుకలు ఎక్కువ రోజులు జరుగుతాయి.
తాజావార్తలు
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?