UK: భారత జెండాను చూసి ఖలిస్తానీలకు మంట.. మరోసారి హైకమిషన్ పై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Mission In UK: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు హైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ అణిచివేతకు వ్యతిరేకంగా బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి భారత రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. అయితే ఈ సారి కూడా భారత దౌత్యసిబ్బంది జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆదివారం ఇదే విధంగా కొంతమంది భారత హైకమిషన్ పై దాడి చేసి భారత జెండాను కిందికి దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో హైకమిషన్ సిబ్బంది భారీ జెండాతో వారికి బుద్ధి చెప్పింది. అయితే ఈ చర్యతో అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు ఉడికిపోతున్నారు. బుధవారం మరోసారి దాడికి తెగబడ్డారు.
Read Also: IND vs AUS: మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం
Also Read
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
- Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
ఆందోళనకారులను నిలువరించేందుకు 24 బస్సుల్లో బలగాలతో పాటు మౌంటెడ్ పోలీసులను మోహరించారు. ఈ చర్యతో నిరసనకారులు భారత హైకమిషన్ పైకి నీళ్ల బాటిళ్లను విసిరారు. పోలీసులపై ఇంక్, కలర్స్ పోశారు. చిన్నగా ప్రారంభం అయిన బుధవారం ఆందోళనలో 2000 మంది దాకా పాల్గొన్నారు. పథకం ప్రకారం మహిళలు, చిన్నారులను నిరసనల్లో భాగం చేశారు. బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంజాబ్ లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అంతకుముందు రోజు బ్రిటన్ ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిగా ఇండియా న్యూఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ వెలుపల ఉన్న బారికేడ్లను తొలగించింది. ఈ చర్యలో బ్రిటన్ ప్రభుత్వం భారతహైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఆదివారం కూడా ఇదే విధంగా అల్లర్లు జరగడంతో భారత ప్రభుత్వం సీరియస్ అయింది. బ్రిటన్ హైకమిషన్ కు సమన్లు జారీ చేసింది. తమ నిరసనను తెలిపింది.
#protestors contained by the @metpoliceuk on the opposite side in Aldwych, outside the Indian embassy. Meanwhile it is business as usual at the @HCI_London. Images on Wednesday afternoon. @ndtv pic.twitter.com/bXrcwjw8UX
— Radhika Iyer (@RadhikaIyer_) March 22, 2023
తాజావార్తలు
-
Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
-
Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
-
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
-
Netflix: నెట్ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?