UK: భారత జెండాను చూసి ఖలిస్తానీలకు మంట.. మరోసారి హైకమిషన్ పై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Mission In UK: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు హైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ అణిచివేతకు వ్యతిరేకంగా బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి భారత రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. అయితే ఈ సారి కూడా భారత దౌత్యసిబ్బంది జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆదివారం ఇదే విధంగా కొంతమంది భారత హైకమిషన్ పై దాడి చేసి భారత జెండాను కిందికి దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో హైకమిషన్ సిబ్బంది భారీ జెండాతో వారికి బుద్ధి చెప్పింది. అయితే ఈ చర్యతో అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు ఉడికిపోతున్నారు. బుధవారం మరోసారి దాడికి తెగబడ్డారు.
Read Also: IND vs AUS: మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం
Also Read
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ఆందోళనకారులను నిలువరించేందుకు 24 బస్సుల్లో బలగాలతో పాటు మౌంటెడ్ పోలీసులను మోహరించారు. ఈ చర్యతో నిరసనకారులు భారత హైకమిషన్ పైకి నీళ్ల బాటిళ్లను విసిరారు. పోలీసులపై ఇంక్, కలర్స్ పోశారు. చిన్నగా ప్రారంభం అయిన బుధవారం ఆందోళనలో 2000 మంది దాకా పాల్గొన్నారు. పథకం ప్రకారం మహిళలు, చిన్నారులను నిరసనల్లో భాగం చేశారు. బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంజాబ్ లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అంతకుముందు రోజు బ్రిటన్ ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిగా ఇండియా న్యూఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ వెలుపల ఉన్న బారికేడ్లను తొలగించింది. ఈ చర్యలో బ్రిటన్ ప్రభుత్వం భారతహైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఆదివారం కూడా ఇదే విధంగా అల్లర్లు జరగడంతో భారత ప్రభుత్వం సీరియస్ అయింది. బ్రిటన్ హైకమిషన్ కు సమన్లు జారీ చేసింది. తమ నిరసనను తెలిపింది.
#protestors contained by the @metpoliceuk on the opposite side in Aldwych, outside the Indian embassy. Meanwhile it is business as usual at the @HCI_London. Images on Wednesday afternoon. @ndtv pic.twitter.com/bXrcwjw8UX
— Radhika Iyer (@RadhikaIyer_) March 22, 2023
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!