క్రికెట్ విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదం తీవ్రమవుతోంది. పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ పై నిషేధం విధించిన తర్వాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఐపీఎల్ 2026 ప్రసారాన్ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ బంగ్లాదేశ్ అధికారులు జనవరి 5న ఒక ప్రకటన విడుదల చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఐపీఎల్కు సంబంధించిన ప్రసారాలు, కార్యక్రమాలను తక్షణమే నిలిపివేసినట్లు బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ఇప్పటికే లిటన్ దాస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు ఫిబ్రవరి 7 […]
ఐఆర్సిటిసి కుంభకోణం కేసులో అభియోగాలు మోపడాన్ని సవాలు చేస్తూ ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జనవరి 5 సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి నోటీసు జారీ చేసింది. జస్టిస్ స్వరణ్ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ నుండి ప్రతిస్పందన కోరింది. అయితే, ప్రస్తుతానికి విచారణను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. లాలూ యాదవ్ , అతని భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్తో పాటు […]
ఈ సంవత్సరం ఫ్లిప్కార్ట్ మొట్టమొదటి బిగ్ సేవింగ్స్ సేల్ ప్రారంభమైంది. జనవరి 2 నుండి జనవరి 6 వరకు జరిగే ఈ సేల్ అనేక ప్రొడక్ట్స్ పై భారీ తగ్గింపులను అందిస్తుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్ఫోన్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయొచ్చు. రూ.5,999 నుండి ప్రారంభమవుతుంది. రియల్మీ మాజీ CEO మాధవ్ సేథ్ స్వదేశీ బ్రాండ్ నుండి ఇటీవల ప్రారంభించబడిన AI+ పల్స్ స్మార్ట్ఫోన్ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.7,999తో ప్రారంభమైన ఈ […]
జాతీయ పండుగల్లో ఒకటైన రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) వేడుకలకు దేశ ప్రజలు రెడీ అవుతున్నారు. భారత్ లో ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే జాతీయ పండుగ. ఇది 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన రోజును సూచిస్తుంది. ఈ రోజున ఢిల్లీలో గొప్ప సైనిక, సాంస్కృతిక పరేడ్ జరుగుతుంది. బీటింగ్ రిట్రీట్ పూర్తి డ్రెస్ రిహార్సల్ జనవరి 28న, బీటింగ్ రిట్రీట్ పరేడ్ జనవరి 29న […]
ఏదైనా కేసుల్లో చిక్కుకున్నప్పుడు, లేదా మరే ఇతర న్యాయ సలహా అవసరం అయినప్పుడు అడ్వకేట్స్ ను సంప్రదిస్తుంటారు. కొన్ని సార్లు ఇది కూడా సాధ్యపడకపోవచ్చు. దీంతో ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఖర్చుతో కూడుకున్నది కూడా. ఇలాంటి సమయంలో ఫ్రీగా న్యాయ సలహా లభిస్తే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికోసమే నూతన సంవత్సర సందర్భంగా, భారత ప్రభుత్వం ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్లో న్యాయ సేతు చాట్బాట్ను ప్రారంభించింది. న్యాయ, […]
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రికార్డ్ క్రియేట్ చేసింది. భారత్ లో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా మహీంద్రా నిలిచింది. 2025 సంవత్సరం మహీంద్రాకు చారిత్రాత్మకమైనది. మొదటిసారిగా, కంపెనీ ఒక క్యాలెండర్ సంవత్సరంలో 600,000 వాహనాల అమ్మకాలను సాధించింది. డిసెంబర్లో మహీంద్రా 50,946 SUVల అమ్మకాలతో ఈ సంవత్సరాన్ని బలమైన నోట్తో ముగించింది. మహీంద్రా ఇప్పుడు మారుతి సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల కంపెనీగా అవతరించింది. దాని గురించి వివరంగా మీకు తెలియజేద్దాం. దేశంలో […]
హానర్ ఈరోజు చైనాలో మరో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తోంది. దీనిని కంపెనీ హానర్ పవర్ 2 పేరుతో పరిచయం చేయనుంది. ఈ హ్యాండ్ సెట్ కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ను కలిగి ఉంటుందని, ఫోన్ 10,080mAh బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ రాబోయే హానర్ పవర్ 2 పనితీరును దాని ప్రారంభానికి ముందు వీబో పోస్ట్లో టీజ్ చేసింది. ఈ పరికరం AnTuTu బెంచ్మార్క్లో 2.4 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ చేసింది. […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతికర్త ఇమేజ్ను పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆయన అధికారంలో ఉన్న మొదటి సంవత్సరంలో ఏడు దేశాలపై దాడికి పాల్పడ్డారు. లొకేషన్ ఆఫ్ ది ఆర్మ్డ్ కాన్ ఫ్లిక్ట్, ఈవెంట్ డేటా ప్రకారం, జనవరి 20, 2025 నుండి అమెరికా విదేశీ గడ్డపై మొత్తం 622 బాంబు దాడులు చేసింది. మే నెలలో, భారత్, పాకిస్తాన్ మధ్య వివాదంతో సహా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు, కానీ భారత్ ఈ వాదనను […]
సచిన్ టెండూల్కర్.. క్రికెట్ హిస్టరీలో రికార్డుల రారాజు. క్రికెట్ లో కలకాలం నిలిచిపోయే ఎన్నో రికార్డులను సచిన్ నెలకొల్పాడు. టీమిండియాకు ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. భారత గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలువబడే సచిన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా, అద్భుతమైన బ్యాట్స్ మెన్ గా పేరొందారు. తన బ్యాటింగ్ తో క్రికెట్ లవర్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. యువతకు రోల్ మోడల్ గా నిలిచారు. సచిన్ టెండూల్కర్ తన […]
ఇటీవల సంభవిస్తున్న భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అస్సాంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, భూకంప కేంద్రం 26.37 ఉత్తర అక్షాంశం, 92.29 తూర్పు రేఖాంశం వద్ద 50 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. Also Read:Jupally Krishna Rao […]