దాయాది దేశం పాకిస్తాన్ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దేశంగా అవమానాన్ని మూటగట్టుకుంటోంది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ నరమేధానికి పాల్పడుతోంది. తాజాగా మరో భయంకరమైన వాస్తవం వెలుగుచూసింది. పొరుగు దేశమైన పాకిస్తాన్లో విద్య కూడా చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ దేశంలో 2023 జనాభా లెక్కల ప్రకారం 63 శాతం మంది యువత ఎప్పుడూ పాఠశాలకు హాజరు కాలేదని, 23 శాతం మంది కౌమారదశలో ఉన్నవారు అధికారిక విద్యను కూడా పొందలేదని షాకింగ్ డేటా […]
వరంగల్ చౌరస్తాలో వివాహిత కత్తి పట్టుకుని హల్చల్ చేసింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నించింది. భార్య నుండి తప్పించుకునేందుకు జ్యువలరీ షాపులోభర్త దాక్కున్నాడు. వెంటనే డయల్100 కి ఫోన్ చేశాడు భర్త. అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహిళ చేతిలోని కత్తిని పోలీసులు లాక్కున్నారు. తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది వివాహిత జ్యోత్స్న. Also Read:Mahindra-Tata- M Evs: మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ vs టాటా నెక్సాన్ […]
రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవారిని అంతమొందిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మళ్లీ మళ్లీ నిరూపిస్తు్న్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా కొండపాక (మం) తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం చిన్నల్లుడు అత్తను హత్య చేశాడు. భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఒంటరిగా ఉంటున్న రాములమ్మ ( 55). ఆరు నెలల క్రితం తన పేరుపై ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఇద్దరు కూతుళ్లకి సమానంగా పంచుతానని […]
ఐఐటీ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. జర్మని ఇనిస్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ సెంటర్ ప్రొఫెసర్ వెర్నర్ సీగర్, పద్మవిభూషణ్, AIG హాస్పిటల్ అధినేత నాగేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, AIG హాస్పిటల్ అధినేత నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో హార్ట్ ఎటాక్ ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరంగా మారిందన్నారు. కరోనా తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువయ్యాయన్నారు. Also Read:Story Board: రాజకీయ కుటుంబాల్లో గొడవలకు […]
పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తోంది. మంచి వడ్డీ రేటుతో గ్యారంటీ రిటర్న్స్ తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని భావించే వారు పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. జనవరి 1న ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ, చివరి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్ల కోసం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. […]
కేపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్ లోని ఆలయం లో భారీ చోరీ చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లోని మూలవిరాట్ కు సంబంధించిన ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. సుమారు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించారు. […]
సంఘటిత జీఎస్టీ (GST) పన్ను ఎగవేత కేసులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులను మరింత ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్, అంతర-ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో, భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర పన్ను మోసాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ ఇద్దరు ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. 2025 జనవరి […]
పరారీలో ఉన్న అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డిని నిన్న రాత్రి హైదరాబాద్ లో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ 13న కల్వకుర్తి స్టేషన్ నుంచి నాగిరెడ్డి పారిపోయిన విషయం తెలిసిందే. చోరీ కేసులో అరెస్ట్ అయిన తెలుగు నాగిరెడ్డి అలియాస్ మల్లెపూల నాగిరెడ్డి. విచారణ కోసం కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకు వచ్చారు. వాష్ రూమ్ పేరుతో స్టేషన్ బాత్రూం నుంచి బయటికి వెళ్లి పరారయ్యాడు నాగిరెడ్డి. నాగిరెడ్డి పరారితో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు హెడ్ […]
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. భార్యభర్తలు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కలకలా జీవించాలని సూచిస్తుంటారు. కానీ, నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ఆర్థిక కారణాలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, అయిష్టం ఇలా రకరకాల కారణాలతో వివాహబంధాలను తెంపుకుంటున్నాయి కొన్ని జంటలు. మరికొందరైతే చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్లు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య […]
మహబూబ్ నగర్ సీసీ కుంట మండలం ఫర్దిపూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ఉజ్జయిని పుణ్య క్షేత్ర దర్శనానికి వెళ్తుండగా తుఫాన్ ను ట్రక్కు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు నర్సింహా (28), శివ (26) మృతి. మరో 9 మందికి గాయాలు అయ్యాయి. బాధితులంతా ఫర్దిపూర్ గ్రామస్థులే అని అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన […]