గంజాయి సరఫరా, వినియోగానికి పట్టుపగ్గాలు లేకుండా పోతోంది. డ్రగ్స్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలో హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫుకెట్ దేశం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఎయిర్ ఇండియా విమానం సీట్ నెంబర్ 16, 17 లలో హైడ్రోపోనిక్ గాంజాయి వదిలి వెళ్ళారు […]
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడా తాలూకాలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ కేసు నమోదైంది. ఒక అమ్మాయి తోటి విద్యార్థిని నమాజ్ చేయమని బలవంతం చేసింది. ఈ సంఘటన తర్వాత, ఇన్స్టిట్యూట్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్, టీచర్ను సస్పెండ్ చేసింది. ఆదివారం రాత్రి పోషేరీలోని కళాశాలలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం, వైద్య కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది, విద్యార్థులు నిరసనలకు దిగారు. సమాచారం అందుకున్న అనంతరం పోలీసులను అక్కడ మోహరించారు. […]
ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్యలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుర్క్మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) బుధవారం ఉదయం బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించింది. ఆక్రమణను తొలగించడానికి ఆ స్థలంలో పదిహేడు బుల్డోజర్లను మోహరించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు […]
Redmi కొత్త రెడ్మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్ ను విడుదల చేసింది. ఈ టాబ్లెట్ 12,000mAh బ్యాటరీతో వస్తుంది. 12.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. Redmi Pad 2 Pro 5G 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన Wi-Fi-మాత్రమే వేరియంట్ ధర రూ.22,999 నుండి ప్రారంభమవుతుంది. Wi-Fi + 5G వేరియంట్ ధర రూ.25,999. 8GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన Wi-Fi + 5G మోడల్ ధర రూ.27,999. యాక్సిస్ బ్యాంక్, […]
ఫిన్నిష్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ వెర్జ్ మోటార్ సైకిల్స్ ఆశ్చర్యపరిచే బైక్ ను ఆవిష్కరించింది. CES 2026లో, కంపెనీ సాలిడ్-స్టేట్ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బైక్ ను ఆవిష్కరించింది. ఈ బైక్ ఇతర ఎలక్ట్రిక్ బైక్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అద్భుతమైన పనితీరు, ఫీచర్లను కలిగి ఉంది. Verge TS Pro మోడల్తో, ఈ టెక్నాలజీ ఇప్పుడు ల్యాబోరేటరి నుంచి వీధులకు తరలించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే […]
న్యూ ఇయర్ వేళ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ చైనీస్ టెక్ కంపెనీ Xiaomi భారత్ లో Redmi Note 15 5Gని ఆవిష్కరించింది. Redmi Note 15 5G 4K వీడియో సపోర్ట్తో కూడిన అద్భుతమైన 108MP కెమెరా, 6.77-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్, 5,520mAh బ్యాటరీతో వస్తుంది. భారత్ లో Redmi Note 15 5G ధర 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్కు రూ. […]
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర దగ్గుతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. భారీ వాయు కాలుష్యం వల్లే సోనియాకు అనారోగ్యం కలిగినట్లు తెలుస్తోంది. సీనియర్ పల్మోనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Also Read:Redmi Note 15 5G: 108MP కెమెరా, స్నాప్డ్రాగన్ […]
దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా కంపెనీ వెహికల్స్ కు మార్కెట్ లో క్రేజీ డిమాండ్ ఉంటుంది. గతేడాదిలో ఏకంగా 6 లక్షల వాహనాలను విక్రయించి సేల్స్ లో దుమ్ము రేపింది. తాజాగా మరో SUVతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ తన కొత్త SUV, మహీంద్రా XUV 7XOను అధికారికంగా విడుదల చేసింది. ఈ SUV ని గతంలో XUV 700 గా అందించేవారు, కానీ ఇప్పుడు, దాని ఫేస్ లిఫ్ట్ తో పాటు, […]
ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. బైకులు, స్కూటర్లు, కార్లు హైటెక్ ఫీచర్లతో వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. తాజాగా భారతీయ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి వెర్షన్తో పోలిస్తే కంపెనీ స్కూటర్లో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. అంతేకాకుండా సింపుల్ వన్ అల్ట్రాను కూడా ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 […]
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. ఒ ఎన్ జి సి అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. బ్లో అవుట్ తరహాలో మంటలు కూడా రావడంతో అదుపు చేసేందుకు వెళ్లిన ONGC సిబ్బంది పరుగులు తీశారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ONGC బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు జరిగిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్ […]