Earthquake: అస్సాంలో 5.1 తీవ్రతతో భూకంపం.. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రకంపనలు
- అస్సాంలో 5.1 తీవ్రతతో భూకంపం
- సోమవారం తెల్లవారుజామున భూకంపం
- అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఈ ప్రకంపనలు సంభవించాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సంభవిస్తున్న భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అస్సాంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, భూకంప కేంద్రం 26.37 ఉత్తర అక్షాంశం, 92.29 తూర్పు రేఖాంశం వద్ద 50 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది.
Also Read:Jupally Krishna Rao : కృష్ణా జలాలపై కేసీఆర్ సంతకం తెలంగాణకు శాపం
Also Read
మిడిల్ అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో స్వల్పంగా ప్రకంపనలు అనుభవించినప్పటికీ, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అస్సాంతో పాటు, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్యంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ ప్రకంపనలు చాలా తేలికపాటివి కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
-
Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
-
Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
-
Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!