కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రినన్న విషయం మరిచి విద్యుత్ షాక్ తో మృతి చెందిన కొడుకు మృత దేహాన్ని నదిలో పడేశాడు. సిర్పూర్ టి మండలం టోంకిని కి చెందిన జయేందర్( 19 ) పంట చేనుకు వేసిన విద్యుత్ కంచె (ఫెన్సింగ్ )తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నేరం తనమీదకు వస్తుందని భయాందోళనకు గురైన తండ్రి మృత దేహాన్ని పెనుగంగ నదిలో పడేశాడు. ఆ తర్వాత కుమారుడు కనిపించడం […]
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. న్యూయార్క్లో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. న్యూయార్క్లో ఒక చిన్న విమానం కూలిపోవడంతో ఒకరు మరణించారు. అయితే, ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీకి దక్షిణంగా శనివారం మధ్యాహ్నం ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న ఒక చిన్న విమానం కూలిపోయి, ఒకరు మృతి చెందారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు తెలిపారు. Also Read:Prabhas : ‘స్పిరిట్’ మూవీ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో ఓపెనర్ అభిషేక్ శర్మ. అభిషేక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కింగ్స్ను ఓడించాడు. సన్ రైజర్స్ […]
కొన్ని సందర్భాల్లో రీల్ సీన్స్ రియల్ సీన్స్ గా మారినప్పుడు ఆశ్చర్యపోవడం తప్పనిసరి అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 2014లో 19 ఏళ్ళ వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు 11 ఏళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కనిపోయించకుండా పోయిన కుమారుడు తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. 11 ఏళ్ల క్రితం కనిపోయించకుండా పోయిన కుమారుడిని మెదక్ జిల్లా […]
జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్లో నా పలుకుబడి గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలి అంటున్నాడు.. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది, సుప్రీం కోర్టు […]
దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ విజయ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు. తమ కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని హనుమంతుడిని కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరం అంతటా హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి వేళ పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రీతి జింటా […]
డిజిటల్ పేమెంట్స్ వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లందరు యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతో సహా భారత్ లోని అనేక నగరాల్లో శనివారం మధ్యాహ్నం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. చాలా మంది UPI ద్వారా చెల్లింపులు చేయలేకపోతున్నారు. Also Read:Shalini Pandey: ఆ హీరోతో రొమాన్స్ […]
చిన్నకోడూరు (మం) గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీంనగర్ లో వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పండి.. గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా ఏ ఊరికి వెళ్దామో రండి రుణమాఫీ ఎక్కడ జరిగిందో చూద్దాం.. పద్మశ్రీ […]
ఆస్తుల కోసం అయినవారిని పొట్టనబెట్టుకుంటున్నారు. ఆస్తి తమకే దక్కాలన్న దురాశతో అన్నదమ్ములను, అక్కాచెల్లెల్లను, తల్లిదండ్రులను సైతం అంతమొందిస్తున్నారు. ఇలాంటి ఘటనే నగరంలోని మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం సవతి తల్లి కూతురిని హత్య చేసింది. మేడిపల్లిలో దారుణ హత్యకు గురైన మహేశ్వరి కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరిని హత్య చేసింది సవతి తల్లి లలిత ఆమె మరిది రవి అతని స్నేహితుడు వీరన్నలుగా పోలీసులు గుర్తించారు. Also Read:AP Inter Results 2025: ఇంటర్ […]
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పొలం వద్దకు వెళ్లిన రైతు విద్యుత్ వైర్లు కాళ్లకు తగిలి మృతిచెందాడు. పుల్కాల్ (మం) మీన్ పూర్ తండాలో రెండ్రోజుల క్రితం గాలి దూమరానికి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఇది గమనించిన రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కరెంట్ కట్ చేశాం..త్వరలోనే వైర్ పునరుద్దరిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు అధికారులు. కరెంట్ కట్ చేశామని అధికారులే చెప్పడంతో నిన్న […]