ICC Women’s Cricket World Cup 2025: ప్రపంచ కప్ షెడ్యూల్ను మార్చిన ఐసీసీ.. చిన్నస్వామి స్టేడియం ఔట్..
- ప్రపంచ కప్ షెడ్యూల్ను మార్చిన ఐసీసీ
- చిన్నస్వామి స్టేడియం ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెలలో భారతh, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసిసి మార్పులు చేసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ఐసిసి తొలగించి వేరే స్టేడియంకు మార్చింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్లకు మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ స్టేడియాలలో ఒకటి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం. దీనిలో ఇకపై మ్యాచ్లు జరగవు. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్లు ఇకపై నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని ఐసిసి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Peddireddy Ramachandra Reddy : చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఎందుకు అలానే చేయలేదు
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఈ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్లు జరగాల్సి ఉంది. వాటిలో మూడు మ్యాచ్లు లీగ్ దశకు చెందినవి. ఒకటి సెమీ-ఫైనల్ మ్యాచ్. భారత జట్టు ఫైనల్కు చేరుకుంటే, ఈ టైటిల్ మ్యాచ్ కూడా ఈ స్టేడియంలోనే జరిగేది. ఈ మ్యాచ్లన్నీ ఇప్పుడు DY పాటిల్ స్టేడియంలోనే జరుగుతాయి. వాస్తవానికి, కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియం మ్యాచ్లను నిర్వహించడానికి సురక్షితం కాదని గుర్తించింది. అందుకే ఈ స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ICC తొలగించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ గెలుచుకున్న తర్వాత, M. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ పరేడ్ జరిగింది. ఈ విజయోత్సవ పరేడ్ సందర్భంగా, స్టేడియం వెలుపల తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనిలో 11 మంది మరణించారు. అలాగే, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత, జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దర్యాప్తులో M. చిన్నస్వామి స్టేడియం భారీ కార్యక్రమాలకు సురక్షితం కాదని తేలింది.
Also Read:Kurnool : తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
2025 ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్ అక్టోబర్ 29 న గౌహతి లేదా కొలంబోలో జరుగుతుంది. రెండవ సెమీ-ఫైనల్ అక్టోబర్ 30 న నవీ ముంబైలో జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ 2 న కొలంబో లేదా నవీ ముంబైలో జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు చివరి-4కి అర్హత సాధిస్తే, అది కొలంబోలో మొదటి సెమీ-ఫైనల్ ఆడుతుంది. పాకిస్తాన్ జట్టు ఫైనల్కు చేరుకుంటే, టైటిల్ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగితే, మొదటి సెమీఫైనల్ కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరుకోలేకపోతే, అన్ని నాకౌట్ మ్యాచ్లు భారతదేశంలోనే జరుగుతాయి.
Mark your calendars 🗓️
The updated schedule for ICC Women's Cricket World Cup 2025 is out 🏆 #CWC25 | Details 👇 https://t.co/jBoQOHox5V
— ICC (@ICC) August 22, 2025
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?