ICC Women’s Cricket World Cup 2025: ప్రపంచ కప్ షెడ్యూల్ను మార్చిన ఐసీసీ.. చిన్నస్వామి స్టేడియం ఔట్..
- ప్రపంచ కప్ షెడ్యూల్ను మార్చిన ఐసీసీ
- చిన్నస్వామి స్టేడియం ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెలలో భారతh, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసిసి మార్పులు చేసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ఐసిసి తొలగించి వేరే స్టేడియంకు మార్చింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్లకు మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ స్టేడియాలలో ఒకటి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం. దీనిలో ఇకపై మ్యాచ్లు జరగవు. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్లు ఇకపై నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని ఐసిసి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Peddireddy Ramachandra Reddy : చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఎందుకు అలానే చేయలేదు
Also Read
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ఈ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్లు జరగాల్సి ఉంది. వాటిలో మూడు మ్యాచ్లు లీగ్ దశకు చెందినవి. ఒకటి సెమీ-ఫైనల్ మ్యాచ్. భారత జట్టు ఫైనల్కు చేరుకుంటే, ఈ టైటిల్ మ్యాచ్ కూడా ఈ స్టేడియంలోనే జరిగేది. ఈ మ్యాచ్లన్నీ ఇప్పుడు DY పాటిల్ స్టేడియంలోనే జరుగుతాయి. వాస్తవానికి, కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియం మ్యాచ్లను నిర్వహించడానికి సురక్షితం కాదని గుర్తించింది. అందుకే ఈ స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ICC తొలగించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ గెలుచుకున్న తర్వాత, M. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ పరేడ్ జరిగింది. ఈ విజయోత్సవ పరేడ్ సందర్భంగా, స్టేడియం వెలుపల తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనిలో 11 మంది మరణించారు. అలాగే, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత, జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దర్యాప్తులో M. చిన్నస్వామి స్టేడియం భారీ కార్యక్రమాలకు సురక్షితం కాదని తేలింది.
Also Read:Kurnool : తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
2025 ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్ అక్టోబర్ 29 న గౌహతి లేదా కొలంబోలో జరుగుతుంది. రెండవ సెమీ-ఫైనల్ అక్టోబర్ 30 న నవీ ముంబైలో జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ 2 న కొలంబో లేదా నవీ ముంబైలో జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు చివరి-4కి అర్హత సాధిస్తే, అది కొలంబోలో మొదటి సెమీ-ఫైనల్ ఆడుతుంది. పాకిస్తాన్ జట్టు ఫైనల్కు చేరుకుంటే, టైటిల్ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగితే, మొదటి సెమీఫైనల్ కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరుకోలేకపోతే, అన్ని నాకౌట్ మ్యాచ్లు భారతదేశంలోనే జరుగుతాయి.
Mark your calendars 🗓️
The updated schedule for ICC Women's Cricket World Cup 2025 is out 🏆 #CWC25 | Details 👇 https://t.co/jBoQOHox5V
— ICC (@ICC) August 22, 2025
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!