ICC Women’s Cricket World Cup 2025: ప్రపంచ కప్ షెడ్యూల్ను మార్చిన ఐసీసీ.. చిన్నస్వామి స్టేడియం ఔట్..
- ప్రపంచ కప్ షెడ్యూల్ను మార్చిన ఐసీసీ
- చిన్నస్వామి స్టేడియం ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెలలో భారతh, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసిసి మార్పులు చేసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ఐసిసి తొలగించి వేరే స్టేడియంకు మార్చింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్లకు మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ స్టేడియాలలో ఒకటి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం. దీనిలో ఇకపై మ్యాచ్లు జరగవు. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్లు ఇకపై నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని ఐసిసి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Peddireddy Ramachandra Reddy : చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఎందుకు అలానే చేయలేదు
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
ఈ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్లు జరగాల్సి ఉంది. వాటిలో మూడు మ్యాచ్లు లీగ్ దశకు చెందినవి. ఒకటి సెమీ-ఫైనల్ మ్యాచ్. భారత జట్టు ఫైనల్కు చేరుకుంటే, ఈ టైటిల్ మ్యాచ్ కూడా ఈ స్టేడియంలోనే జరిగేది. ఈ మ్యాచ్లన్నీ ఇప్పుడు DY పాటిల్ స్టేడియంలోనే జరుగుతాయి. వాస్తవానికి, కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియం మ్యాచ్లను నిర్వహించడానికి సురక్షితం కాదని గుర్తించింది. అందుకే ఈ స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ICC తొలగించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ గెలుచుకున్న తర్వాత, M. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ పరేడ్ జరిగింది. ఈ విజయోత్సవ పరేడ్ సందర్భంగా, స్టేడియం వెలుపల తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనిలో 11 మంది మరణించారు. అలాగే, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత, జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దర్యాప్తులో M. చిన్నస్వామి స్టేడియం భారీ కార్యక్రమాలకు సురక్షితం కాదని తేలింది.
Also Read:Kurnool : తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
2025 ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్ అక్టోబర్ 29 న గౌహతి లేదా కొలంబోలో జరుగుతుంది. రెండవ సెమీ-ఫైనల్ అక్టోబర్ 30 న నవీ ముంబైలో జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ 2 న కొలంబో లేదా నవీ ముంబైలో జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు చివరి-4కి అర్హత సాధిస్తే, అది కొలంబోలో మొదటి సెమీ-ఫైనల్ ఆడుతుంది. పాకిస్తాన్ జట్టు ఫైనల్కు చేరుకుంటే, టైటిల్ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగితే, మొదటి సెమీఫైనల్ కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరుకోలేకపోతే, అన్ని నాకౌట్ మ్యాచ్లు భారతదేశంలోనే జరుగుతాయి.
Mark your calendars 🗓️
The updated schedule for ICC Women's Cricket World Cup 2025 is out 🏆 #CWC25 | Details 👇 https://t.co/jBoQOHox5V
— ICC (@ICC) August 22, 2025
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..