Veerababu Burugadda
Author- NTV Telugu-
Rohit Yadav: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్పై రెండేళ్ల నిషేధం..
వయసు ధృవీకరణ పత్రాల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిన బెంగాల్ లెగ్ స్పిన్నర్, భారత అండర్-19 జట్టు ఆటగాడు రోహిత్ యాదవ్పై బిసిసిఐ రెండేళ్ల కఠిన నిషేధం విధించింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) సీజన్ ముందు నిర్వహించిన ధృవీకరణ పత్రాల పరిశీలనలో ఈ మోసం బయటపడింది. జూలైలో శ్రీలంకలో పర్యటించిన భారత అండర్-19 జట్టులో భాగమైన 19 ఏళ్ల రోహిత్, త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు వన్డేలు, రెండు రోజుల మ్యాచ్ల సిరీస్కు కూడా ఎంపికయ్యాడు. […] -
Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మహిళల ఆసియా కప్ 2026లో హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన శతకంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్రూప్-ఎ లో భాగంగా గురువారం జరిగిన ఈ పోరులో మంధాన విజృంభించి కేవలం 57 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నారు. మొత్తంగా ఆమె 124 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల […] -
Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ప్రభసిమ్రన్ సింగ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నారు. ఇటీవల ప్రకటించిన ఆప్ఘనిస్తాన్ టీ20 సిరీస్ కోసం భారత జట్టులో ఇతనికి చోటు దక్కలేదు. ఆయన స్థానంలో సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. జూలై 2026లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టులో భాగమైనప్పటికీ, ఆ సమయంలో ప్రభసిమ్రన్కు ఆడే అవకాశం రాలేదు. అయితే ఆప్ఘనిస్తాన్ సిరీస్ నుంచి తప్పించిన కొద్ది గంటల్లోనే ఆయన తన బ్యాట్తో గట్టి సమాధానం […] -
Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
ముంబైలోని ప్రముఖ జీఎస్బీ సేవా మండల్ ప్రసిద్ధి చెందిన ‘మహా గణపతి’ గణేశోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. భక్తుల రక్షణ, వారి భద్రతతో పాటు మండలికి చెందిన అత్యంత విలువైన ఆస్తుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఏకంగా రూ.703.27 కోట్ల భారీ ఉత్సవ బీమా (ఇన్సూరెన్స్) కవరేజీని తీసుకుంది. దేశ విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాలకు వేదికైన ఈ మహా గణపతిని భక్తులు “నవసాలా పావ్నారా విశ్వచా రాజా” […] -
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలపై వస్తున్న విమర్శలపై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నాఖ్వీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో పాకిస్థాన్ ఘోర ఓటములను చవిచూడటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లండన్లో మీడియాతో మాట్లాడిన నాఖ్వీ, జట్టును విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఏమీ సాధించని వారే ఇప్పుడు జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో కొన్ని మ్యాచ్ల్లో ఓటములు సహజమని, […] -
Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2026 లో తమ రెండవ మ్యాచ్లో హాంకాంగ్తో తలపడేందుకు సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ పోరులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఇప్పటికే టోర్నీలో బోణీ కొట్టిన టీమిండియా, ఈ మ్యాచ్ ద్వారా తమ బ్యాటింగ్ లోపాలను సవరించుకోవాలని చూస్తోంది. ఆ తర్వాత జరగబోయే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోరుకు ముందు జట్టులోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా మారింది. […] -
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భారత క్రికెట్ బోర్డు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ కీలక భేటీలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, కోశాధికారి ప్రభతేజ్ సింగ్ భాటియా, […] -
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
పూరీ జగన్నాథ ఆలయ యాజమాన్య సంస్థ ఆలయ బ్యాంకు బ్యాలెన్స్కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించింది. అయోధ్య రామ్ మందిర విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. పారదర్శకతను చాటుకునేందుకు జగన్నాథుని పేరిట బ్యాంకుల్లో రూ. 1,912 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు ప్రకటించింది. ఆలయ నిధుల నిర్వహణ అత్యున్నత పారదర్శకతతో, క్రమబద్ధమైన ఆడిటింగ్, అకౌంటింగ్ పద్ధతుల ద్వారా జరుగుతోందని ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద కుమార్ పఢీ స్పష్టం చేశారు. భక్తుల నమ్మకాన్ని కాపాడేందుకు స్పష్టమైన […] -
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు, మాజీ భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ధోనీ ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదని సీఎస్కే మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ వెల్లడించారు. ఒకవేళ ఐపీఎల్ ఆడటం కొనసాగిస్తే, తాను పూర్తి స్థాయి వికెట్ కీపర్-బ్యాటర్గానే మైదానంలో ఉంటానని ధోనీ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో 2027 ఐపీఎల్ సీజన్లో ధోనీ భాగస్వామ్యంపై అనిశ్చితి […] -
PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
అమెరికన్ ఫిన్టెక్ దిగ్గజం పేపాల్ (PayPal) వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా నిర్వహించిన గ్లోబల్ రీస్ట్రక్చరింగ్లో భాగంగా భారతదేశంలో భారీగా లేఆఫ్స్ చేపట్టింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లోని టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆపరేషన్స్, పేమెంట్స్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. తెలిసిన సమాచారం ప్రకారం.. దాదాపు 600 మంది ఉద్యోగులను తొలిగించారని, ఇది భారతీయ మొత్తం సిబ్బందిలో 10 శాతమని తెలుస్తోంది. అయితే పేపాల్ ప్రతినిధి ఈ వార్తలను స్పష్టం చేస్తూ, ఆగస్టు 31న […]
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?