రీల్స్ కోసమో.. ఫేమస్ కోసమో తెలియదు గానీ ఈ మధ్య యువత చేసే నీచపు పనులు కంపరం పుట్టిస్తున్నాయి. ఛీ.. అంటూ ఉమ్ము వేయించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెర్కాడోనా సూపర్ మార్కెట్లో జరిగింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ను ఉరితీయాలని రక్షాబంధన్ రోజున అతడి సోదరి డిమాండ్ చేసింది. సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని చెప్పింది. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు ఆమె చెప్పింది.
ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ అదృశ్యమయ్యాడు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు.
దేశంలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. జమ్మూకాశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్కతా ఘటనతో దేశం అట్టుడుకుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా కామాంధుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. కనీస భయం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు
విద్యాశాఖకు జీఎస్టీ నోటీసులు ఇవ్వడంపై దుమారం రేపుతోంది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి జోక్యం పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఐఐటీ-ఢిల్లీకి రూ.120 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసు పంపించింది. 2017-2022 మధ్యకాలంలో ఐఐటీ-ఢిల్లీ అందుకున్న రీసెర్చ్ గ్రాంట్లపై జీఎస్టీ నోటీసు వచ్చింది.
మధ్యప్రదేశ్లో ఓ మహిళా కానిస్టేబుల్ అత్యుత్సాహం ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఓ కోచింగ్ సెంటర్ను ప్రమోట్ చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన పబ్లిక్లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆమె చర్యను తప్పుపడుతూ సస్పెండ్ చేవారు.
మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్లోని జైసింగ్పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఊరట లభించింది. ముడా భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రిని ప్రాసిక్యూషన్కు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా తమిళనాడులో మరో అత్యంత ఘోరమైన కీచకపర్వం వెలుగులోకి వచ్చింది.