ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు.
పాకిస్థాన్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ (71) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సలహాదారు సయ్యద్ బుఖారీ ధృవీకరించారు. ఏడాదికి పైగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాత్రి గడువు కంటే ముందే దరఖాస్తును సమర్పించినట్లు వెల్లడించారు.
రైల్వే వ్యవస్థను ఆధునీకరించాం అంటూ కేంద్ర ప్రభుత్వం ఉపన్యాసాలతో ఊదరగొడుతోంది. రైలు కోచ్లను సుందరీకరించాం.. మెరుగైన వసతులు కల్పిస్తున్నామని రైల్వేశాఖ గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అవన్నీ మాటలకే పరిమితం అని అర్ధమవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైంది. చివరిదాకా సూచీలు గ్రీన్లోనే ట్రేడ్ అయ్యాయి.
సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) తీస్తా స్టేజ్ 5 డ్యామ్లోని పవర్ స్టేషన్పై భారీ కొండచరియలు పడి ధ్వంసమైంది. ఇది 510 మెగావాట్ల పవర్ స్టేషన్. దీన్ని ఆనుకుని కొండచరియలు ఉన్నాయి.
ఓ వైపు రక్షాబంధన్ వేడుకలు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఢిల్లీ వాసులంతా రోడ్లపైకి వచ్చారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి.
రీల్స్ కోసమో.. ఫేమస్ కోసమో తెలియదు గానీ ఈ మధ్య యువత చేసే నీచపు పనులు కంపరం పుట్టిస్తున్నాయి. ఛీ.. అంటూ ఉమ్ము వేయించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెర్కాడోనా సూపర్ మార్కెట్లో జరిగింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ను ఉరితీయాలని రక్షాబంధన్ రోజున అతడి సోదరి డిమాండ్ చేసింది. సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని చెప్పింది. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు ఆమె చెప్పింది.
ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ అదృశ్యమయ్యాడు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు.