విద్యాశాఖకు జీఎస్టీ నోటీసులు ఇవ్వడంపై దుమారం రేపుతోంది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి జోక్యం పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఐఐటీ-ఢిల్లీకి రూ.120 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసు పంపించింది. 2017-2022 మధ్యకాలంలో ఐఐటీ-ఢిల్లీ అందుకున్న రీసెర్చ్ గ్రాంట్లపై జీఎస్టీ నోటీసు వచ్చింది.
మధ్యప్రదేశ్లో ఓ మహిళా కానిస్టేబుల్ అత్యుత్సాహం ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఓ కోచింగ్ సెంటర్ను ప్రమోట్ చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన పబ్లిక్లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆమె చర్యను తప్పుపడుతూ సస్పెండ్ చేవారు.
మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్లోని జైసింగ్పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఊరట లభించింది. ముడా భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రిని ప్రాసిక్యూషన్కు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా తమిళనాడులో మరో అత్యంత ఘోరమైన కీచకపర్వం వెలుగులోకి వచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ ఉదయం లాభాలతో ట్రేడ్ అయింది. చివరికి అస్థిరత మధ్య మిశ్రమంగా ముగిశాయి.
ప్రధాని మోడీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది.. అన్ని ఆస్పత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఐఎంఏతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సమావేశం అయ్యారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరింది.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ట్రాన్స్జెండర్స్ కూడా రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శనివారం వైద్యులు, నర్సులు 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య బృందాలతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు నిరసన తెలిపారు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన తాజాగా మీడియాతో స్పందించారు. ప్రస్తుతం ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందుతున్నాయో తనకు తెలియదన్నారు.