Tamil Nadu: నకిలీ ఎన్సీసీ క్యాంప్లో 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు
- తమిళనాడు నకిలీ ఎన్సీసీ క్యాంప్లో కీచకపర్వం
- 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు
- బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో 11 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా తమిళనాడులో మరో అత్యంత ఘోరమైన కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఎన్సీసీ క్యాంప్ నిర్వహించి.. 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు మొదటి వారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Minister Subhash: గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి సుభాష్
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఓ రాజకీయ పార్టీకి చెందిన శివరామన్ ఇటీవల కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్కు వెళ్లాడు. పాఠశాలలో ఎన్సీసీ క్యాంప్ నిర్వహిస్తామని స్కూల్ యాజమాన్యాన్ని నమ్మించాడు. దీంతో ముందు వెనుక చూసుకోకుండా స్కూల్ మేనేజ్మెంట్ నకిలీ ఎన్సీసీ క్యాంప్ పెట్టేందుకు అంగీకరించింది. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ క్యాంప్నకు 41 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 17 మంది బాలికలు ఉండగా.. అమ్మాయిలకు మొదటి అంతస్తులోని స్కూల్ ఆడిటోరియం, అబ్బాయిలకు గ్రౌండ్ ఫ్లోర్లో వసతి కల్పించారు. పర్యవేక్షణ కోసం స్కూల్ యాజమాన్యం ఎవర్నీ నియమించలేదు. ఇదే అదునుగా భావించి శివరామన్.. 8వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా ఇంకో 12 మంది అమ్మాయిలను కూడా లైంగికంగా వేధించాడు. బాధిత అమ్మాయిలు ఆగస్టు 9నే స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కానీ స్కూల్ పరువుపోతుందని సైలెంట్గా ఉన్నారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: IRCTC: ట్రైన్లో సైడ్ లోయర్ బెర్త్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇది తెలుసుకోండి..?
బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శివరామన్, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు సహా 11 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తదుపరి కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. అలాగే విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!