Tamil Nadu: నకిలీ ఎన్సీసీ క్యాంప్లో 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు
- తమిళనాడు నకిలీ ఎన్సీసీ క్యాంప్లో కీచకపర్వం
- 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులు
- బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో 11 మంది అరెస్ట్
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా తమిళనాడులో మరో అత్యంత ఘోరమైన కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఎన్సీసీ క్యాంప్ నిర్వహించి.. 13 మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు మొదటి వారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Minister Subhash: గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి సుభాష్
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఓ రాజకీయ పార్టీకి చెందిన శివరామన్ ఇటీవల కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్కు వెళ్లాడు. పాఠశాలలో ఎన్సీసీ క్యాంప్ నిర్వహిస్తామని స్కూల్ యాజమాన్యాన్ని నమ్మించాడు. దీంతో ముందు వెనుక చూసుకోకుండా స్కూల్ మేనేజ్మెంట్ నకిలీ ఎన్సీసీ క్యాంప్ పెట్టేందుకు అంగీకరించింది. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ క్యాంప్నకు 41 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 17 మంది బాలికలు ఉండగా.. అమ్మాయిలకు మొదటి అంతస్తులోని స్కూల్ ఆడిటోరియం, అబ్బాయిలకు గ్రౌండ్ ఫ్లోర్లో వసతి కల్పించారు. పర్యవేక్షణ కోసం స్కూల్ యాజమాన్యం ఎవర్నీ నియమించలేదు. ఇదే అదునుగా భావించి శివరామన్.. 8వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా ఇంకో 12 మంది అమ్మాయిలను కూడా లైంగికంగా వేధించాడు. బాధిత అమ్మాయిలు ఆగస్టు 9నే స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కానీ స్కూల్ పరువుపోతుందని సైలెంట్గా ఉన్నారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: IRCTC: ట్రైన్లో సైడ్ లోయర్ బెర్త్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇది తెలుసుకోండి..?
బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శివరామన్, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు సహా 11 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తదుపరి కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. అలాగే విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో