Siddaramaiah: ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రిలీఫ్
- ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రిలీఫ్
- ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఊరట లభించింది. ముడా భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రిని ప్రాసిక్యూషన్కు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు సోమవారం ట్రయల్ కోర్టును ఆదేశించింది. హైకోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు… అనగా ఆగస్టు 29 వరకు ముఖ్యమంత్రికి మధ్యంతర ఉపశమనం అమలులో ఉంటుంది.
ముడా భూ కుంభకోణం కేసులో తనను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని తప్పుపడుతూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ చర్య చట్ట విరుద్ధమని.. అంతేకాకుండా ఇది తీవ్రచర్య అని పిటిషన్లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిపాలనకు అంతరాయం కలిగించడం.. అలాగే రాజకీయ అస్థిరత సృష్టించేందుకు గవర్నర్ ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విచారించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ తేదీ వరకు సంబంధిత ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
విచారణ సందర్భంగా సిద్ధరామయ్య తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. కర్ణాటకలో సక్రమంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్ ఈ చర్యలకు పాల్పడ్డారని వాదించారు. ముఖ్యమంత్రిపై అభియోగాలు మోపిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ను వర్తింపజేయడానికి రెండు షరతులు లేవని ఆయన వాదించారు.
ఇదిలా ఉంటే.. బెంగళూరు చిత్రకళా పరిషత్లో ఫొటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అనంతరం సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ముడా కేసులో న్యాయం జరుగుతుందని తన మనసాక్షికి తెలుసు అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నట్టు చెప్పారు. ఒక్క మచ్చ కూడా లేదని చెప్పారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని.. తానే ఏ తప్పు చేయలేదని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అని చెప్పుకొచ్చారు. రాజ్భవన్ను ఉపయోగించుకుని బీజేపీ, జేడీఎస్, కేంద్ర ప్రభుత్వం తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొంటామని స్వష్టం చేశారు. తనను రాజకీయంగా అంతం చేయగలమనేది వారి భ్రమ అని ఎద్దేవా చేశారు. తాను పేదలకు అండగా ఉంటూ… ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుండటం… ప్రతిపక్షాన్ని కలవరపెడుతోందన్నారు. సిద్దరామయ్యను రాజకీయంగా అంతమొందిస్తే కాంగ్రెస్ పార్టీని అంతమొందించవచ్చనే భ్రమలో ప్రతిపక్షాలు ఉన్నాయని సిద్ధరామయ్య విమర్శించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!