హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష్ హత్య కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషాను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే శిరీషను చంపినట్లుగా పోలీసులు తేల్చారు.
తమిళంపై కేంద్రానికి ప్రేముంటే.. తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. డీలిమిటేషన్పై స్టాలిన్.. బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయా రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో కమల్హాసన్ కూడా పాల్గొన్నారు.
మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8 గా నమోదైంది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. భూప్రకంపనలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. నిన్నామొన్నటి దాకా డిజిటల్ అరెస్ట్తో కోట్ల కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు రూట్ మార్చారు. న్యూడ్ కాల్స్ పేరుతో సామాన్యుల్నే కాదు.. ఏకంగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. వాళ్లను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నారు.
కర్ణాటకలోని బెళగావిలో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందని యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐశ్వర్య మహేష్ లోహర్ (20)ని ప్రశాంత్ కుండేకర్ (29) అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పనకు సంబంధించి హెల్త్ అప్డేట్ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణ హాని లేదని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం వ్యవహారం అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్లోని నిజాంపేటలో ఆమె నివాసంలో ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. రెండు రోజుల నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు వచ్చి తలుపులు బద్ధలు గొట్టి లోపలికి వెళ్లారు.
మహా కుంభమేళా ఓ కుటుంబం యొక్క తలరాత మార్చింది. కుంభమేళా ఆ కుటుంబానికి కాసుల వర్షం కురిపించింది. లక్ష కాదు.. కోటి కాదు.. ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ వార్త చెప్పింది ఎవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రే చెప్పారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు.
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ ఆఫీసర్ల నియామకాల్లో జరిగిన అక్రమలపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. పీహెచ్సీలో డెంటల్ వైద్యులు.. మెడికల్ ఆఫీసర్స్గా పనిచేయడంపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు
మహబూబాబాద్ జిల్లాలో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. పక్కింటి కోళ్లు.. ఇంట్లోకి వచ్చాయంటూ ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. ఏకంగా ఓ వృద్ధుడి రెండు కాళ్లను గొడ్డలితో నరికేశాడు. దీంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో విలవిలాడిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సిరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూధనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.