CM Yogi: కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది
- కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది
- యూపీ శాసనసభలో సీఎం యోగి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళా ఓ కుటుంబం యొక్క తలరాత మార్చింది. కుంభమేళా ఆ కుటుంబానికి కాసుల వర్షం కురిపించింది. లక్ష కాదు.. కోటి కాదు.. ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ వార్త చెప్పింది ఎవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రే చెప్పారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad : మలక్ పేట్ శిరీష హత్య కేసులో ట్విస్ట్ ..
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 2025-26 బడ్జె్ట్పై చర్చ సందర్భంగా కుంభమేళాపై సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 130 పడవలు కలిగిన ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందని వెల్లడించారు. కుంభమేళాపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను మంగళవారం ముఖ్యమంత్రి తిప్పికొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పడవలు నడిపిన వారంతా రోజుకి రూ.50,000 నుంచి 52,000 వేలు సంపాదించారని తెలిపారు. ఒక నేరం కూడా జరగకుండా 45 రోజులు ప్రశాంతంగా కుంభమేళా జరిగిందని స్పష్టం చేశారు. ఇక వేధింపులు, కిడ్నాప్లు, దోపిడీలు, హత్యలకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్లారన్నారు. రూ.3లక్షల కోట్ల ఆదాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుంభమేళాను అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసించిందని యోగి గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Warangal: మెడికల్ ఆఫీసర్ల నియామకాల అక్రమాలపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ
మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. మహా శివరాత్రి ఫిబ్రవరి 26న కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరిగింది. దాదాపు 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేశారు. ఇక రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..