తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది.
సంచలనం సృష్టించిన డెడ్బాడీ హోమ్ డెలివరీ కేసులో ట్విస్టులమీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమగోదావరిజిల్లా యండగండిలో ఈనెల 19వ తేదీన సాగి తులసి అనే మహిళ ఇంటికి చేరిన పార్సిల్ డెడ్బాడీ కేసులో పోలిసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది.. ఎందుకంటే.. ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మ రెండో భార్య రేవతి పాత్రపై అనుమానాలు వ్యక్తం…
అల్లు అర్జున్ ఎపిసోడ్లో పార్టీ నాయకులు.. గప్చుప్గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పుష్ప సినిమా వ్యవహారంలో ప్రభుత్వం.. పోలీసులు చూసుకుంటారని దానిపై రాజకీయ నాయకుల కామెంట్స్ అవసరం లేదని హెచ్చరించారు. అనవసరంగా నాయకులు ఎదురుదాడి చేస్తే తలనొప్పి వస్తుందని ముందే గ్రహించిన సీఎం రేవంత్రెడ్డి...పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి.. వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను.. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది అని పేర్కొన్న సీఎం చంద్రబాబు
వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బల హీనపడుతుందని అంచనాలు వున్నాయి.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులు కూడా జారీ చేసింది.. ఇదే సమయంలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.