విద్యా శాఖలో వచ్చే ఏడాది నుంచి, ప్రతి విద్యార్ధికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తాం. రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి నారా లోకేష్..
ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం.. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఛీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు..
తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం అయ్యారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంట.. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు గజేంద్ర సింగ్ షెఖావత్ అంటే అపారమైన గౌరవం అన్నారు.. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తుచేశారు.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని…
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ లభిస్తే అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ ను తోసిపుచ్చారు పోలీసులు.. రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులను ధిక్కరించారు కాబట్టే అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు.. ఈ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ చేరుకున్నారు పవన్ కల్యాణ్.. అయితే, ఈ రోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై చర్చించనున్నారు..
ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు - శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. "దాన" తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు - శ్రీలంకలోని…
ప్రతీ ఏడాది కార్తిక మాసంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది.. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం 17 రోజుల పాటు కొనసాగాయి.. ఈ నెల 25వ తేదీన అంటే.. కార్తిక చివరి సోమవారం రోజు ముగిసింది..
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. గతంలో విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన విషయం విదితమే..