Tirumala Adulterated Ghee Case: తిరుమలలో కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది.. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక నిందితుడుగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్ను అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. అజయ్ కుమార్ మోన్ గ్లిసరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కెమికల్స్ను పామాయిల్ తయారీలో వినియోగించి, అదే పామాయిల్ను నెయ్యి పేరుతో […]
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. మరికాసేపట్లో ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా మామండూరు అటవి ప్రాంతానికి వెళ్లి, ఎర్రచందనం గోడౌన్లను పరిశీలిస్తారు. తర్వాత మంగళంలో ఉన్న ఎర్రచందనం నిల్వ గోదాములను సందర్శించనున్న పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం కలెక్టరేట్లో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. నిల్వలో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించనున్నారు. […]
TDP vs Janasena: కాకినాడ జిల్లా తుని కూటమిలో కొత్త పంచాయతీ మొదలైంది.. టీడీపీ అభ్యర్థిగా ఉన్న యనమల దివ్య గెలుపు కోసం ఎన్నికల్లో ఎంతో కృషి చేశామని, ఇప్పుడు జనసేనకి కనీస విలువ ఇవ్వడం లేదని అంటున్నారు ఆ పార్టీ తుని కోఆర్డినేటర్ గణేష్.. ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్టీలో ఉంటున్నామని, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో కూడా జనసేనకు నియోజకవర్గంలో అన్యాయం జరిగిందని కార్యకర్తల సమావేశంలో గుర్తుచేస్తున్నారు.. అన్నిటినీ భరిస్తూ వస్తున్నామని, తిరుపతి లెటర్ […]
Off The Record: తర్క వితర్కాలు, పెద్ద పెద్ద చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండానే…. ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పాటు వివిధ వర్గాల్లో ఒక స్థిరమైన అభిప్రాయమైతే ఉంది. అదే… వైసీపీలో కమ్మ కులానికి అంత ప్రాధాన్యం ఉండదని. అలాగే ఆ సామాజికవర్గంలో ఎక్కువ మంది అదే విషయాన్ని నమ్ముతారు కూడా. వాళ్ళతో మాకెలాంటి విభేదాలు లేవని వైసీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు చెప్పినా… అనుమానాలు మాత్రం తొలిగిపోలేదన్నది నిష్టుర సత్యం. అలా ఖచ్చితంగా ఆ సామాజికవర్గానికి, పార్టీకి […]
Off The Record: వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్కు అడ్డాగా మారిపోయింది జీడీనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత… మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి రివర్స్లో ఉంటోందట. గడిచిన ఐదేళ్ళ నుంచి ఆయనకు మొత్తం అపసవ్య దిశలోనే తిరుగుతోందంటున్నారు. ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసినప్పుడు ఎటువంటి తలనొప్పులు పడని నారాయణ స్వామి….తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి… ఇంకా చెప్పాలాంటే డిప్యూటీ సిఎం అయినప్పటి నుంచి రాష్ట్రం సంగతి తర్వాత…. సొంత నియోజకవర్గంలోనే ఐ […]
Off The Record: రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అని తలపడటం ఒక ఎత్తయితే…. ఎక్కువ మంది మాత్రం వ్యూహాత్మక ఎత్తుగడల్ని ఫాలో అవుతుంటారు. అందులో కూడా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సెక్షన్ కూడా ఒకటుంటుంది. వాళ్ళు మనవాళ్ళో పగవాళ్ళో తెలిసే లోపే… జరక్కూడని నష్టం జరిగిపోతుంది. కుదిరితే కుట్రలతో ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు లేదంటే వెన్నుపోటు పొడిచి దెబ్బ తీస్తారు. ప్రస్తుతం ఇలాంటి రాజకీయాలకు కేరాఫ్గా మారుతోంది అనంతపురం జిల్లా. మరీ ముఖ్యంగా వైసీపీలో ఈ […]
Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ ప్రారంభించారు.. వీరిని ఐదు రోజులపాటు విచారించనున్నారు.. కోర్టు ఆదేశాలతో నిందితులను జైలు నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం తరలించారు.. కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లా భక్షు లను కస్టడీ కి తీసుకున్నారు. ఈ ఏడుగురు కూడా అద్దేపల్లి జనార్ధన్ కి నకిలీ […]
Crime News: లెస్బియన్ అఫైర్ తో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది.. ఏకంగా 6 నెలల పిసికూన అయిన కన్న కొడుకునే చంపేసింది ఓ మహిళ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన సురేష్ (38). అతను దినసరి కూలీ. అతను మరియు అదే ప్రాంతానికి చెందిన భారతి (26) 6 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి 5 మరియు 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు […]
Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, అక్టోబర్ 11వ తేదీన బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం.. ఇక టెండర్ల దాఖలుకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది సర్కార్.. తాజాగా డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో.. డీపీఆర్ టెండర్ల […]
CM Chandrababu:కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచడం ద్వారా రైతులకు ఆదాయం పెంచడంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు… సాగులో పురుగుమందుల వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు… రైతు గౌరవం దేశ గౌరవమన్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125 జయంతి ఉత్సవాలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబుతోపాటు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు పాల్గొన్నారు. యూనివర్సిటీలో […]