YS Jagan Padayatra: రాబోయే కాలంలో ప్రజల మధ్యే ఉంటూ 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… గ్రామస్థాయిలో పార్టీ కమిటీలను మరింత బలోపేతం చేస్తామని, జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని స్పష్టం చేశారు. “ఈసారి ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్బాల్ తన్నినట్టుగా తంతారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇసుక, మద్యం, ఖనిజాల రంగాల్లో విస్తృత స్థాయిలో అవినీతి జరుగుతోందని […]
YS Jagan: రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ జంగిల్రాజ్గా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు, మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. బరితెగింపునకు అడ్డుకట్ట లేకుండా పోయింది. విచ్చలవిడితనం ఊహించని […]
CM Chandrababu: తిరుమల టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్ నివేదికపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారంపై ఏపీ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందన్న తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని […]
Off The Road: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిస్థితి అయోమయం.. గందరగోళం అన్నట్టు మారిపోయింది. ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ చుట్టుపు చూపుగా వచ్చి వెళ్తుండటం.. ముఖ్యమైన కార్యక్రమాలు సైతం ద్వితీయ శ్రేణి నేతలే పర్యవేక్షించాల్సి రావటంతో కేడర్లో నైరాశ్యం పెరుగుతోంది. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ లాంటి కార్యక్రమంలో కూడా బుర్రా మమ అనిపించడంతో.. భారమంతా ద్వితీయ శ్రేణి నేతలే మోయాల్సి వచ్చింది. దీంతో… […]
MLA Arava Sridhar Controversy : రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. తనను లైంగికంగా వేధించారని ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఆరోపించారు. విష్ చేయడానికి కాల్ చేస్తే.. నంబర్ తీసుకున్నారని తెలిపారు. తాను, తన కొడుకు ఉంటామని తెలుసుకున్నారన్నారు. రెండ్రోజుల తర్వాత తన న్యూడ్స్ అడిగారని, వీడియో కాల్స్ చేయాలని బలవంతం పెట్టారని వాపోయారు. కాదనడంతో బెదిరింపులకు దిగారు. కలుస్తావా.. లేదా అని వేధించడం మొదలుపెట్టారని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ఎమ్మెల్యే […]
Off The Road: పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తేజోవతి, ఉపాధ్యక్షుడిగా దత్తి లక్ష్మణరావును నియమించాకే ఈ చర్చ ఊపందుకుందట. ఈ ఇద్దరు నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడికి సన్నిహితులని, నియామకాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారన్న టాక్ బలంగా ఉంది. ఇద్దరి మీద అచ్చెన్న వర్గ ముద్ర ఉంది. దీంతో జిల్లా మీద పట్టు బిగించేందుకు మంత్రి వేరేవాళ్ళకు అవకాశాలు రాకుండా… తన […]
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్షాప్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎవరికిచ్చిన పదవిలో వారే బాధ్యతగా పని చేయాలని, కావాలని వివాదాలు సృష్టిస్తే సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత అజెండాలు, అనవసర వివాదాలతో పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని […]
Off The Road: పదవుల పందేరం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోందట. మెజార్టీ పోస్ట్లను ఒకే కులానికి కట్టబెడుతున్నారంటూ మిగతా నాయకులు అసహనంగా ఫీలవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా సీనియర్ లీడర్స్కు ఇది అస్సలు మింగుడు పడని వ్యవహారంగా మారిందట. అధికారం లేనప్పుడు అన్ని సామాజిక వర్గాల నేతలు కష్టపడి పనిచేసినా… ఇప్పుడు మాత్రం ఒకే కులానికి పెద్ద పీట వేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అధిష్టానం బీసీ మంత్రం జపించడం బాగానే ఉన్నా… అందులోనూ […]
కోడిని కోసినా కేసులు పెడుతున్నారు.. కూటమికి వినాశనం తప్పదు..! వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోడిని కోసినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని, ఈ విధమైన పాలనతో కూటమికి వినాశనం తప్పదని ఆయన హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు గడిచినా రాష్ట్ర పరిస్థితి మారలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తోందని ఆరోపించారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం […]
Botsa Satyanarayana: విశాఖ జిల్లా అధికారుల తీరుపై వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) ఎక్స్ ఆఫిషియో జాబితా నుంచి తన పేరును తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం భూముల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో, పాలకవర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించి తన పేరును ఎక్స్ ఆఫిషియో సభ్యుల జాబితా నుంచి తొలగించిందని బొత్స ఆరోపించారు. ఈ విషయమై […]