CM Chandrababu: పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమర్ధత లేకపోతే శిక్షణ ఇచ్చి, నిరంతరం పర్యవేక్షించాలని.. తద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు. సాంకేతికతతో గవర్నెన్స్లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించేలా కోరారు. 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్గా మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. ఏఐ […]
WhatsApp: స్మార్ట్ ఫోన్ ఉంటే.. వాట్సాప్ ఉండాల్సిందే.. అలసు ఈ యాప్ లేని ఫోన్ ఉంటుందా? అనే స్థాయిలోకి తీసుకెళ్లింది ఈ యాప్.. తక్కువ కాలంలోనే ఎన్నో మార్పులు.. మరెన్నో అప్డేట్లు.. మెసేజ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో కీలక ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో […]
TDP: జనసేన-బీజేపీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం.. మరోవైపు.. కూటమిలోని పార్టీలు.. ఆయా పార్టీల నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టాయి.. మరోవైపు.. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవల జిల్లా కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేసిన అధిష్టానం, ప్రస్తుతం రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు […]
CM Chandrababu: నగరి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 2024కు ముందు రాష్ట్రం పూర్తిగా అతలాకుతలం అయిందన్న ఆయన.. నోటీసులు కూడా ఇవ్వకుండా తనను రాత్రికి రాత్రే అరెస్టు చేశారని, గత ఐదేళ్లుగా కనీసం మాట్లాడాలన్నా, నవ్వాలన్నా వీలుకాని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత భయంకరమైన పాలన ఐదేళ్లపాటు కొనసాగిందని ఆయన విమర్శించారు. Read Also: Nihilist Penguin: ఈ పెంగ్విన్ స్టోరీ మీమ్ కాదు.. మైండ్ […]
Air India Flights Cancelled: యూఎస్కు విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.. అమెరికాలో సంభవించే.. చారిత్రాత్మకంగా నమోదయ్యే అవకాశం ఉన్న శీతాకాల తుఫాను నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ప్రకటన చేసింది. జనవరి 25 మరియు 26 తేదీల్లో.. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు.. న్యూయార్క్, న్యూజెర్సీలోని విమానాశ్రయాలకు వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతను […]
AP Handicrafts Global Recognition: ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఘనమైన గుర్తింపు లభించిందని రాష్ట్ర మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్లో నిర్వహించనున్న భారత్ రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ హస్తకళలతో రూపొందించిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్లను అందజేయాలని భారత్ హై కమిషన్ నిర్ణయించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సింగపూర్లోని భారత్ హై కమిషనర్, మొత్తం 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ల తయారీకి ఏపీ ప్రభుత్వ సంస్థ లేపాక్షికి ఆర్డర్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ […]
Union Minister Srinivas Varma: సినిమా గ్లామర్తో మాత్రమే రాజకీయాల్లో విజయం సాధించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా గ్లామర్ను మాత్రమే ఆధారంగా చేసుకుని రాజకీయాల్లో రాణించిన ఉదాహరణలు లేవని స్పష్టం చేశారు. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను బలమైన ప్రజా నాయకుడిగా శ్రీనివాస్ వర్మ అభివర్ణించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యల కోసం పోరాడే నాయకత్వం ఆయనదని […]
US Tariff: భారతదేశంపై అమెరికా విధించిన 25 శాతం సుంకాన్ని (టారిఫ్) భవిష్యత్తులో ఎత్తివేసే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకం అమెరికాకు “చాలా విజయవంతమైందని” పేర్కొన్న ఆయన, పరిస్థితులు అనుకూలిస్తే దీనిని తొలగించే మార్గం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 25 శాతం సుంకం వల్ల రష్యా చమురు కొనుగోళ్లు తగ్గాయన్న అమెరికా స్కాట్ బెస్సెంట్ ప్రకారం, […]
ACB Raid: పెండింగ్లో ఉన్న క్యాటరింగ్ బిల్లు క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ అధికారి.. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబట్టారు.. మూడు లక్షలు లంచం తీసుకుంటూ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచలనం సృష్టించింది. నర్సరావుపేటకు చెందిన కరిముల్లా క్యాటరింగ్ కాంట్రాక్టు చేస్తుంటారు. గత ప్రభుత్వంలో వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన మాచర్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి క్యాటరింగ్ ఆర్డర్ కరిముల్లా దక్కించుకున్నారు. అయితే, క్యాటరింగ్ […]
Annavaram Temple Prasadam: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం కి సంబంధించిన ప్రసాద విక్రయ కేంద్రములో ఎలుకలు తిరుగుతున్నాయి… నేషనల్ హైవే మీద ఏర్పాటుచేసిన ప్రసాదం విక్రయ కేంద్రం లో ఈ ఘటన జరిగింది.. అమ్మడానికి ఉంచిన ప్రసాదం బుట్టలలో నుంచి బయటికి వస్తున్నాయి ఎలుకలు.. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భక్తులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇదేంటని ప్రసాదం అమ్ముతున్న వారిని ప్రశ్నిస్తే నచ్చితే […]