Bank Strike: వరుసగా బ్యాంక్ల మూత.. రేపు సమ్మెకు పిలుపు
- వరుస సెలవులతో గత 3 రోజులుగా పనిచేయని బ్యాంకులు..
- జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె..
- పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మూసివేత..
- SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడాపై ప్రభావం..
- సమ్మెలో పాల్గొననున్న దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Strike: దేశవ్యాప్తంగా బ్యాంక్ వినియోగదారులకు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు. వరుస సెలవులతో ఇప్పటికే గత మూడు రోజులుగా బ్యాంకులు పనిచేయని పరిస్థితి ఉండగా.. రేపు అనగా మంగళవారం రోజు మరోసారి బ్యాంక్లు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపుతో బ్యాంక్ ఉద్యోగులు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ సమ్మెలో AIBEA, AIBOC, NCBE సహా మొత్తం తొమ్మిది బ్యాంక్ యూనియన్లు పాల్గొంటున్నాయి. దాదాపు 8 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల సేవలు పూర్తిగా నిలిచే అవకాశం ఉంది. అయితే HDFC, ICICI, Axis వంటి ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితం కావని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
Read Also: Aroori Ramesh : బీజేపీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన ఆరూరి రమేష్..
Also Read
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ 5-డే వర్క్ వీక్గా ఉంది.. 2024 మార్చిలో కుదిరిన 12వ బైపార్టైట్ సెటిల్మెంట్లో అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు అంగీకారం వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై నోటిఫికేషన్ విడుదల చేయలేదని యూనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 5-డే వర్క్ వీక్ అమలుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్యోగులు చెబుతున్నారు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడాలన్నది కూడా వారి కీలక డిమాండ్. ఈ సమ్మె కారణంగా నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్, బ్రాంచ్ సేవలు పూర్తిగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే కొనసాగుతాయి అని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. వరుస సెలవులు, ఆపై సమ్మె కారణంగా బ్యాంకింగ్ పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర లావాదేవీలు ఉన్న వినియోగదారులు ముందుగానే డిజిటల్ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..