Bank Strike: వరుసగా బ్యాంక్ల మూత.. రేపు సమ్మెకు పిలుపు
- వరుస సెలవులతో గత 3 రోజులుగా పనిచేయని బ్యాంకులు..
- జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె..
- పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మూసివేత..
- SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడాపై ప్రభావం..
- సమ్మెలో పాల్గొననున్న దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Strike: దేశవ్యాప్తంగా బ్యాంక్ వినియోగదారులకు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు. వరుస సెలవులతో ఇప్పటికే గత మూడు రోజులుగా బ్యాంకులు పనిచేయని పరిస్థితి ఉండగా.. రేపు అనగా మంగళవారం రోజు మరోసారి బ్యాంక్లు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపుతో బ్యాంక్ ఉద్యోగులు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ సమ్మెలో AIBEA, AIBOC, NCBE సహా మొత్తం తొమ్మిది బ్యాంక్ యూనియన్లు పాల్గొంటున్నాయి. దాదాపు 8 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల సేవలు పూర్తిగా నిలిచే అవకాశం ఉంది. అయితే HDFC, ICICI, Axis వంటి ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితం కావని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
Read Also: Aroori Ramesh : బీజేపీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన ఆరూరి రమేష్..
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ 5-డే వర్క్ వీక్గా ఉంది.. 2024 మార్చిలో కుదిరిన 12వ బైపార్టైట్ సెటిల్మెంట్లో అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు అంగీకారం వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై నోటిఫికేషన్ విడుదల చేయలేదని యూనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 5-డే వర్క్ వీక్ అమలుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్యోగులు చెబుతున్నారు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడాలన్నది కూడా వారి కీలక డిమాండ్. ఈ సమ్మె కారణంగా నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్, బ్రాంచ్ సేవలు పూర్తిగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే కొనసాగుతాయి అని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. వరుస సెలవులు, ఆపై సమ్మె కారణంగా బ్యాంకింగ్ పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర లావాదేవీలు ఉన్న వినియోగదారులు ముందుగానే డిజిటల్ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్లిఫ్ట్లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!